NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Video Viral: ఐక్యతలో అనైక్యత .. కురుబ సంఘం గుడికట్ల సంబరాల్లో నేతల మధ్య వాగ్వివాదం.. వీడియో వైరల్

Video Viral:  ఓ పక్క కురుబ సంఘం ఐక్యత వర్ధిల్లాలి అంటూనే మరో పక్క నేతలు వాగ్వివాదానికి దిగడంతో ఐక్యత ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. కురుబ సంఘం నేతల వాగ్వివాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కురుబల ఐకమత్యం కోసం ఏర్పాటు చేసిన వేదికపైనే ఐక్యత లేక తోసుకున్నారు అంటూ నెటిజన్లు సెటైర్ వేస్తున్నారు. కురుబ సామాజికవర్గానికి చెందిన నాయకులు గుడికట్ల ఉత్సవాల సాక్షిగా వేదికపై ఒకరికొకరు దూషించుకున్నారు. ఎంతో పవిత్రంగా నిర్వహించాల్సిన కార్యక్రమం రసాభాసగా ముగిసింది.

అనంతపురంలో జరిగిన కురుబల గుడికట్ల సంబరాల్లో కురుబ సామాజికవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు మంత్రి ఉష శ్రీ చరణ్, మాజీ మంత్రి శంకర నారాయణ, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా టీడీపీ నేత బీకే పార్ధసారధి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అయితే వేదికపై ఎటువంటి రాజకీయ ప్రసంగాలు ఉండవు అని, కేవలం పూజా కార్యక్రమాలు, ఇతర సాంస్కృతి వ్యవహారాలు నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నారు. అయితే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మైక్ తీసుకుని కురుబలు ఐక్యంగా ఉన్నారనీ, కానీ నాయకులే సరిగా లేరని, అందుకు సభలో ఉన్న నాయకులే నిదర్శనమని వ్యాఖ్యానించారు. దీనికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్ధసారధి కౌంటర్ ఇవ్వడంతో ఇరువురి మధ్య వాదన జరిగింది. మైక్ లాక్కునే ప్రయత్నం చేయడంతో .. కాసేపు అరుపులు, కేకలతో వేదిక గందరగోళంగా మారింది.

అంతే కాకుండా వేదికపై బీకే పార్ధసారధిని పలువురు గజమాలతో సత్కరించారు. ఆ క్రమంలో ఎంపీ మాధవ్ కూడా ఆ గజమాల మెడలో వేసుకునే ప్రయత్నం చేయడంతో పార్ధసారధి ఆ మాలను తోసేశారు. ఆ తర్వాత ఇద్దరు నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. ఇలా నేతల అనుచరుల మధ్య మాటల యుద్దం తోపులాటకు దారి తీసింది. పోలీసులు, నాయకులు సర్దిచెప్పడంతో గొడవ కొద్ది సేపటికి సద్దుమణిగింది. దీంతో అక్కడ నుండి మంత్రి ఉష శ్రీ చరణ్, ఎంపీ గోరంట్ల మాధవ్ తమ వర్గీయులతో అక్కడి నుండి వెళ్లిపోయారు.

రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో మాత్రమే కురుబ సామాజికవర్గం అధికంగా ఉంది. ఎన్నికల సమయంలో  నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఈ సామాజికవర్గం ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వైసీపీ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీకి అవకాశం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ బీకే పార్ధసారధికి అవకాశం కల్పించింది. అయితే ఒకే సామాజికవర్గం అయిన నేతల మధ్య రాజకీయంగా విభేదాలు కొనసాగుతున్నాయి. కురుబ సామాజికవర్గంలోని జిల్లా నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి అధిపత్యం కోసం గొడవలకు దిగడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

YS Jagan: ‘మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్దికి ఇదే నిదర్శనం’

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?