YSRCP: అనకాపల్లికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డికి పంపించారు. రాజీనామాకు ముందు అనకాపల్లిలో వీరభద్రరావు తన వర్గీయులతో సమావేశమైయ్యారు. అనంతరం తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపించారు.
తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు దాడి వీరభద్రరావు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే ప్రకటన ఉంటుందని, ఏ పార్టీలోచేరేది అప్పుడు చెబుతానని దాడి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరే సమయంలో అనేక హామీలు ఇచ్చారని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేశారన్నారు. కనీసం కలిసేందుకు కూడా సీఎం జగన్ అవకాశం ఇవ్వలేదన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న దాడి వీరభద్రరావు .. 1985 నిం 1999 వరకూ వరుసుగా నాలుగు సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2004 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చేతిలో, 2009 ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్ధి చేతిలో దాడి వీరభద్రరావు పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత అనూహ్యంగా 2014కు ముందు వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పార్టీని వీడారు. ఆ తర్వాత పలు మార్లు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
తిరిగి 2019 ఎన్నికలకు ముందు మరో సారి వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లభించలేదు. ఈ క్రమంలో ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మరో మూడు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరణంలో దాడి వీరభద్రరావు వైసీపీని వీడారు. టీడీపీలో చేరేందుకు దాడి వీరభద్రరావు ఇప్పటికే చంద్రబాబుతో మాట్లాడినట్లుగా తెలుస్తొంది. ఆయన కుమారుడు చంద్రబాబు, లోకేష్ తో కలిసి మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.
WhatsApp: భారత్ లో 75 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్ .. కారణం ఏమిటంటే..?
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!