(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తోంది. అయితే, ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం కోట్ల రూపాయులు ఖర్చు పెడుతున్నా..క్షేత్రస్థాయిలో మాత్రం విద్యార్థులకు పౌష్టికాహారం లభించడం లేదు. మీర్జాపూర్లోని ఓ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కూరగాయలతో కాకుండా ఉప్పుతో భోజనం పెడుతున్నారు. మధ్యాహ్నం పెట్టే భోజనంలో రోటీతోపాటు ఉప్పును పెడుతున్నారు. కొన్ని సార్లు అన్నం, ఉప్పు పెడుతున్నారు. స్కూల్లో దాదాపు వెయ్యి మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి మధ్యాహ్నం భోజనం పథకం కింద పప్పు, అన్నం, రోటీ, పాలు, అరటిపండ్లతో భోజనం పెట్టాలి. కానీ, క్రేత్ర స్థాయిలో ఇది అమలు కావడం లేదు. ఫలితంగా విద్యార్థులు ఉప్పుతో భోజనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలకు పాలు, అరటిపండ్లు పెట్టడం కూడా గగనమైందని విద్యార్థులకు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీర్జాపూర్లో విద్యార్థులకు పెడుతున్న భోజనంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు చర్యలకు దిగారు. స్కూల్ టిచర్తోపాటు నిర్వహకులపై వేటు వేశారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2018 నాటికి దాదాపు 1.5 లక్షల ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పకథం అమలవుతోంది. దాదాపు కోటి మంది విద్యార్ధులు లబ్ధి పొందుతున్నారు. ప్రతిరోజు ఒక విద్యార్థికి కనీసం 12 గ్రాముల ప్రొటిన్తోపాటు 450 క్యాలరీలు అందించే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. ఏడాదిలో కనీసం 200 రోజులు అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పలు స్కూళ్లలో అధికారుల పర్యవేక్షణలోపం, టిచర్లు, నిర్వహకుల ఇష్టం రాజ్యంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందని పరిస్థితి నెలకొంది.
This clip is from a @UPGovt school in east UP's #Mirzapur . These children are being served what should be a 'nutritious' mid day meal ,part of a flagship govt scheme .On the menu on Thursday was roti + salt !Parents say the meals alternate between roti + salt and rice + salt ! pic.twitter.com/IWBVLrch8A
— Alok Pandey (@alok_pandey) August 23, 2019