బలాంగిర్ (ఒడిషా), జనవరి 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒడిషాలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బొలాంగిర్ – బీచువలి రైల్వేలైన్ను నేడు ప్రాంభించారు. సోనేపూర్లో కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనానికి శంకుస్థాపన చేశారు. జగత్సింగ్పూర్, కేంద్రపూర్, పూరి, ఫుల్బని, బార్గఢ్, బలాంగిర్లలో నూతన పాస్పోర్టు సేవా కేంద్రాలను ప్రాంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నెల రోజుల్లో మూడు సార్లు ఇక్కడకు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి అనుసంధానం ఎంతో కీలకమని, టూరిజంతో సహా అన్ని రంగాలపై దాని ప్రభావం ఎంతో ఉంటుందని మోది అన్నారు.
దేశ అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం ఇప్పటి వరకూ చేసిన కార్యక్రమాలను, గత పాలకుల వైఫల్యాలను మోదీ వివరించారు.