వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గత కొద్ది రోజులుగా హైకోర్టు నుండి బ్యాక్ టు బ్యాక్ షాకులు తగిలాయి. దీంతో అనుభవలేమి అధికార పార్టీ ఒకసారి ఢీలా పడిపోతుందని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా భావించారు. వైసిపి కార్యకర్తలు మరియు సపోర్టర్లు అయితే ఎటువంటి ఎదురు సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయారు.
అయితే సరిగ్గా ఇదే సమయంలో జగన్ ఒక్కసారిగా కేబినెట్ మీటింగ్ పెట్టి చంద్రబాబు గత కాలంలో ప్రవేశపెట్టిన స్కీములు పై సిబిఐ విచారణ జరిపించేందుకు నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లోనే టిడిపి మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ జరిగింది. ఒక్కసారిగా విపక్షాలన్నీ అలర్ట్ అయిపోయాయి…. ఖచ్చితంగా చెప్పాలంటే వణికిపోయాయి. ఇక్కడ అందరికీ జగన్ గొప్పతనం మరియు ముందుచూపు కనిపిస్తోంది. కానీ సరిగ్గా చూసినట్లయితే ఇక్కడ సింహభాగం విపక్షాల చేతకానితనం ఇదే ఉంది.
జగన్ ఎన్నికల్లో 151 సీట్లతో భారీ విజయం సాధించారు అంటే వినడానికి పెద్ద గొప్పగా ఉన్నా ఒకసారి మనం ఓటు బ్యాంకు పరిశీలించినా.. ఓటు షేర్ ను పరిశీలించినా జనసేన, బిజెపి మరియు టిడిపి విడిపోవడం వల్లే ఇంత తేడా వచ్చింది అని స్పష్టంగా అర్థం అవుతోంది. అటు బాబు ప్రయత్నాలు చేస్తున్నా బిజెపి వారితో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. ఇక సరే బిజెపి టీడీపీని తొక్కేసి ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. కానీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇద్దరూ కలిసి అధికారాన్నిన్ సరిగ్గా నిలదీసింది కానీ గట్టిగ ఎదిరించింది కానీ ఒక్క సందర్భం కూడా లేదు.
ఖచ్చితమైన మాటల్లో చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుందుడుకు వ్యక్తిని కవ్విస్తూ అతనిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అసలు ఇలాంటి ఒక బలమైన ప్రత్యర్థినిఎదుర్కోవాలంటే చాలా రాష్ట్రాల విపక్షాలు అన్నీ కలిసి కట్టుగా పోరాడుతాయి. సాంకేతికంగా వారు వేర్వేరు పార్టీలు అయినా కూడా ఒక అంశం తెర మీదకు వచ్చేటప్పటికి మూకుమ్మడిగా దాడి చేస్తారు. తద్వారా కచ్చితంగా అధికార పార్టీ ఏదో ఒక పొరపాటు చేస్తే వెంటనే దానిని పట్టుకుని వేలాడి వారి పైన పడి.. దాడి చేసి చివరికి ఏదో ఒక ప్రాంతంలో వారి పొలిటికల్ మైలేజ్ తగ్గించి కానీ వదలరు.
ఎంతో అనుభవం ఉన్న బాబు ఈ ప్రక్రియ మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుపుతుండగానే తన పార్టీలోని అస్థిర స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఆలోచనలను మధ్యలోనే విరమించుకున్నాడు. ఇకపోతే జనసేన మరియు బిజెపి వారు మొదట్లో కాస్త హడావిడి చేసినా ఆ తర్వాత ఎన్నో సార్లు జగన్ వారి ప్లాన్ లకు చెక్ పెట్టింది చూశాం. ఇప్పుడు ఉన్నఫలంగా జనసేన, బీజేపీ మరియు టిడిపి కలవాలా అంటే…. అవసరం లేదు. అవకాశం వచ్చినప్పుడు అధికార పార్టీపై చెలరేగితే చాలు. తర్వాత ఎవరి రాజకీయాలు వారు చేసుకోవచ్చు కానీ అందరూ కలిసి చేసే రాజకీయానికి బలం ఎక్కువ అని వారు తెలుసుకోలేకపోతున్నారు.
ఇదిలా ఉండగా అత్యంత బలమైన ప్రత్యర్థి ఎదుర్కొంటున్నప్పుడు ఒకరితో ఒకరు పోటీ పడుతూ అవతలి వారిని నెగ్గాలనే తపన కొంచెం తగ్గించుకుంటే మేలని కూడా విశ్లేషకులు చెబుతున్నారు ఉదాహరణకు… నిమ్మగడ్డ రమేష్ కుమర్ , ఇంగ్లీష్ మీడియం, ఎల్జీ పాలిమర్స్ వంటి వాటిల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కేసులు వేసింది. కరోనా టెస్ట్ కిట్లలో అవినీతి జరిగిందంటూ టీడీపీ కంటే బీజేపీయే తొలుత రెస్పాండ్ అయింది. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయడంలో బీజేపీ నేతలు టీడీపీ కంటే ముందుంటున్నారు. కానీ తద్వారా వారికి ఏమైనా రాష్టంలో మైలేజ్ పెరిగిందా అంటే.. అంతా దిక్కులు చూడాల్సిన పరిస్థితి. ఎంత కేంద్రం సపోర్టు ఉన్నా ఇక్కడ ఓట్ళు కొల్లగొట్టకున్నా…. కనీస ప్రజాదరణ తెలుసుకోలేకున్నా పడిన శ్రమ అంతా చివరికి బూడిదలో పోసిన పన్నీరే.
కాబట్టి ఇక్కడ జగన్ ఏడాది పాలన చాలా సజావుగా ఎటువంటి ఆటుపోట్లు లేకుండా సాగింది అంటే అందులో కేవలం రాష్ట్రంలోని విపక్షాల వైఫల్యమే కనిపిస్తోంది కానీ జగన్ గొప్ప ఏక్కడని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.