మేము రాసిందే వార్త, అనుకున్నదే కథనం అంటూ ఇంతకాలం సాగిన కొన్ని పత్రికలు మీడియా ఛానళ్లు ఇప్పటికైనా మారని పక్షంలో.. ప్రజలకు తప్పుడు కథనాలు అందిస్తూ, ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు ఆపని పక్షంలో.. జీవో నంబరు 2430 ఉందని ఏపీ ప్రభుత్వం గుర్తుచేస్తోంది.ఇప్పుడు ఆ అస్త్రాన్ని ఆ రెండుపత్రికలపై ప్రయోగించింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచీ… అసెంబ్లీ వేదికగా “ఆ రెండు పత్రికలు” అనే మాట చాలా ఫేమస్! నేరుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన కథనాలు ఎంత తప్పుగా ఉన్నాయో.. పనిగట్టుకుని, కక్షపూరితంగా తన ప్రభుత్వంపైనా, తన పాలనపైనా ఎన్ని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారో.. నేరుగా సీఎం హోదాలో డా. వైఎస్సార్ అసెంబ్లీలో చదివి వినిపించేవారు!ఆ రెండు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి అని వేరుగా చెప్పనక్కరలేదు కదా !ఇప్పుడు రాజశేఖర్రెడ్డి తనయుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ రెండు పత్రికలు మరీ చెలరేగిపోయాయి.దీంతో దీంతో ఏపీ ప్రభుత్వం మీడియాలో తప్పుడు రాతలను కట్టడి చేసేందుకు సరికొత్త జీవో 2430 తెచ్చింది.
ప్రభుత్వ విధానాలపై సరైన సమాచారం లేకుండా, నిరాధారంగా, వ్యక్తుల పరువుకు భంగం కలిగించేలా వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా సదరు మీడియా సంస్ధలకు నోటీసులు ఇవ్వడం.. వాటికీ స్పందించనిపక్షంలో.. చట్టపరమైన చర్యలకు ఉపక్రమించేలా ప్రభుత్వం జీవో నంబర్ 2430ను తీసుకొచ్చింది. దీనిపై పై కూడా కొందరు హైకోర్టుకు వెళ్లినప్పటికీ, ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా స్పందించింది. ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా ప్రతిపక్షనేత చంద్రబాబు, ఆమోద పబ్లికేషన్స్, ఉషోదయా పబ్లికేషన్స్కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.మైనింగ్ తవ్వకాలపై ఈ పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది
ఈ సందర్భంగా రాష్ట్ర భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. మైనింగ్ పై అసత్య ఆరోపణలు చేసినవారిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని.. ఆరోపణలు చేసిన ఆయా సంస్థలు, వ్యక్తులు 15 రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. అలాకానిపక్షంలో పరువునష్టం దావా వేస్తామని ద్వివేదీ స్పష్టం చేశారు. తప్పుడు కథనాలకు సంబంధించి ఆయా పత్రికలు స్పందించిన తీరు సంతృప్తికరంగా లేనందునే తదుపరి చర్యలు తీసుకుంటున్నామన్నారు
దీంతో… ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆమోద పబ్లికేషన్స్ (ఆంధ్రజ్యోతి – రాధాకృష్ణ), ఉషోదయా పబ్లికేషన్స్ (ఈనాడు – రామోజీరావు)లపై ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందని స్పష్టంగా అర్థమైపోతోంది .