రాజుగారి వెనుక ఉన్నది ఎవరు ?కూపీ లాగడం మొదలెట్టిన వైకాపా టాప్ లీడర్ !!వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎంపీగా గెలవగలననే ధీమాతోనే వైసీపీ అధిష్టానానికి ఆయన ఎదురుతిరిగారంటున్నారు.భవిష్యత్ రాజకీయాల కోసమే ఆయన వైసీపీతో కాలు దువ్వుతున్నారన్నది వాస్తవం.రఘురామకృష్ణంరాజు వైఖరి ఇలా ఎందుకు మారింది అన్న విషయమై వైసీపీ లీడర్ ఒకరు ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి అని తెలుస్తోంది
గత కొద్ది రోజులుగా రఘురామకృష్ణంరాజు వైసీపీ అధిష్టానానికి పంటికింద రాయిలా మారారు. ఆయన చేస్తున్న విమర్శలు పార్టీని ఇబ్బంది పెడుతున్నా కొంత సంయమనం పాటిచారు. చివరకు రోజురోజుకూ శృతి మించుతుండటంతో రఘురామకృష్ణంరాజుకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి ఆయన యారగెంట్ గా సమాధానమిచ్చారు. వైసీపీ అస్తిత్వాన్నే ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి ఆయన పార్టీ నుంచి వైదొలగాలనే నిర్ణయించుకున్నారు.అయితే ఆయన భవితవ్యం ఏమిటన్నది చూడాలి.దాన్ని కూడా రఘురామకృష్ణంరాజు ఫిక్స్ చేసుకున్నట్లు కనిపిస్తోంది.ఏ.పి లో రాజకీయ సమీకరణాలు మారాయి. బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అప్పటి నుంచే రఘురామకృష్ణంరాజు వాయిస్ మారింది. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తాయి. అంటే నర్సాపురం పార్లమెంటు స్థానం ఖచ్చితంగా బీజేపీకే దక్కుతుంది. జనసేన కలిస్తే నర్సాపురం లో బీజేపీ విజయం ఖాయమని రఘురామకృష్ణంరాజు భావిస్తున్నారు. నరసాపురంలో మొన్నటి ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా నాగబాబు పోటీ చేశారు. అయితే బిజెపి కనుక గట్టిగా చెబితే ఆయన సీటు కోసం పట్టుబట్టే అవకాశం లేదని భావిస్తున్నారు.
బీజేపీలోకి వెళితే సీటు గ్యారంటీ, గెలవడం ఖాయమని భావించే రఘురామకృష్ణంరాజు వైసీపీ అధిష్టానాన్ని ఖాతరు చేయడం లేదంటున్నారు. మొత్తం రఘురామకృష్ణంరాజు వచ్చే ఎన్నికల్లో విజయం తనదేనన్న ధీమాతోనే కయ్యానికి దిగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.పార్టీలు మారడం లో ఆరితేరిన రఘురామకృష్ణంరాజు పక్కా ప్రణాళికతోనే ముందుకు సాగుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు