New Year Celebrations 2024: ఏపీలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక న్యూఇయర్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేక్ చేయించారు. ఈ క్రమంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎంఓ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు టీటీడీ వేదపండితులు, దుర్గగుడి వేద పండితులు ఆశీర్వచనాలు దించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ కు స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు, టీటీడీ క్యాలెండర్, డైరీలను టీటీడీ అర్చుకులు అందించారు.
దుర్గగుడి వేదపండితులు అమ్మవారి చిత్రపటం, క్యాలెండర్, ప్రసాదాలను ఇచ్చారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్ లను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
YS Sharmila: కుమారుడి వివాహం పై షర్మిల ట్వీట్ .. సోదరుడిని ఆహ్వానిస్తారా..?