Breaking: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కడప పర్యటన రద్దు అయినట్లు తెలుస్తొంది. కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు రేపటి నుండి ఆరంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు సీఎం జగన కడపకు బయలుదేరారు. దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున చాదర్ ను సమర్పించాల్సి ఉంది. అనంతరం దర్గా నుండి రోడ్డు మార్గంలో రాయచోటి రోడ్డులోని మాధవి కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుని తమ సమీప బంధువు, ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించాల్సి ఉంది.
అయితే సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేర నుండగా కడప విమానాశ్రయ ప్రాంతంలో దట్టమైన పొగ మంచు కారణంగా ఎయిర్ ట్రాఫిక్ క్లీయరెన్స్ రాలేదు. దీంతో సీఎం కడప పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. .మరోపక్క సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో కడప జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అమీన్ పీర్ దర్గా వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Breaking: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్.. ఢిల్లీకి ఆహ్వానం