TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. మొయినాబాద్ పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్రభాారతి, నందకుమార్, సింహయాజీలను విచారణ జరిపిన పోలీసులు దర్యాప్తులో భాగంగా పలువురుకి 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు అందుకున్న వారిలో పలువురు కోర్టును ఆశ్రయించగా 41ఏ నోటీసులపై ఈ నెల 13వ తేదీ వరకూ స్టే ఇచ్చింది.
మరో పక్క ఈ కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, కేరళకు చెందిన నాయకుడు తుషార్, వైద్యుడు జగ్గుస్వామి, కరీంనగర్ కు చెందిన న్యాయవాదులను ఏ 4, ఏ5, ఏ 6, ఏ 7గా నిందితుల జాబితాలో చేర్చి పోలీసులు ఏసీబీ కోర్టులో మెమో జారీ చేశారు. పోలీసుల మెమోను తప్పుబడుతూ 7వ నిందితుడుగా ఉన్న శ్రీనివాస్ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మెమో జారీ చేసే విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని శ్రీనివాస్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
Breaking: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్.. ఢిల్లీకి ఆహ్వానం
నిందితుల తరపు న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు శ్రీనివాస్ ను నిందితుడుగా చేర్చడాన్ని తప్పుబట్టింది. ఆయనకు రిలీఫ్ ఇస్తూనే పోలీసులు మెమోను కొట్టివేసింది. దీంతో శ్రీనివాస్ తో పాటు మిగిలిన నిందితులు బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు ఊరట లభించినట్లు అయ్యింది. కేసులో ఇది కీలక పరిణామంగానే భావిస్తున్నారు.
Breaking: సీఎం వైఎస్ జగన్ కడప పర్యటన రద్దు .. ఎందుకంటే..?