ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. ఇటీవల కాలంలో ఏ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ప్రారంభిస్తున్న సందర్భాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో గత ప్రభుత్వ నిర్వాకాన్ని తెలియజేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గత ప్రభుత్వం రైతులకు చేసిన నష్టాన్ని, ప్రభుత్వం అందిస్తున్న కృషిని సీఎం జగన్ వివరించి ఈ వ్యత్యాన్ని రైతులు గమనించాలని కోరారు. సోమవారం నాడు రబీ 2020 – 21, ఖరీఫ్ 2021 సీజన్లకు చెెందిన వైెస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్ – 2022 సీజన్ లో వివిధ రకాల వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్ పుట్ సబ్సిడీ తో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లు సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ గడచిన మూడేళ్లలో 20.85 లక్షల మంది రైతులకు రూ.1,795.40 కోట్ల పంట నష్టపరిహారం జమ చేయగా, తాజాా గా జమ చేసిన మొత్తం 21.31 లక్షల మంది రైతులకు రూ.1,834,79 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ జమ చేసినట్లు అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా, రైతులు మద్య దళారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా ఫరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి ఉండేదన్నారు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఎగ్గొట్టి, మరి కొన్ని సందర్భాల్లో రెండు మూడు సీజన్ల తర్వాతే అరకొరగా సాయం అందించే వారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఈ క్రాప్ ఆధారంగా నమోదైన వాస్తవ సాగు దారులకు నేరుగా వారి ఖాతాల్లోనే ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తున్నామని సీఎం జగన్ వివరించారు.
అంతే కాకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సోషల్ ఆడిట్ కింద రైతు భరోసా కేంద్రాల్లో లబ్దిదారుల జాబితాలు ప్రదర్శించడమే కాదు, అర్హత ఉండి జాబితాల్లో తమ పేర్లు లేకపోతే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించామని సీఎం జగన్ చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతులకు న్యాయం జరుగుతోందని సీఎం అన్నారు. అప్పటి ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ను రైతులు గమనించాలని కోరారు సీఎం జగన్. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని జగన్ పేర్కొన్నారు.
అమరావతి రాజధాని కేసు .. జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట