Dhulipalla Narendra: ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ట్రస్ట్ స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. ట్రస్ట్ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకు ఈ మెయిల్ ద్వారా అధికారులు నోటీసులు పంపారు. సెక్షన్ 43 ప్రకారం ట్రస్ట్ స్వాధీనానికి అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. దేవాదాయ శాఖ చట్టంలోని సెక్షన్ 43 కింద ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునేందుకు గతంలోనూ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే దీనిపై ధూళిపాళ్ల నరేంద్ర కోర్టును ఆశ్రయించారు. ట్రస్ట్ దేవాదాయ చట్టం పరిధిలోకి రాదనీ, తమ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఆసుపత్రి ద్వారా రైతు కుటుంబాలకు సేవ చేస్తుందని వాదనలు వినిపించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీనిపై కోర్టు.. ఎలాంటి తదుపరి చర్యలూ వద్దంటూ ప్రభుత్వానికి సూచించింది. కోర్టులో ఈ నెల 29న కేసు విచారణకు రావాల్సి ఉంది. ఈ లోగా మరో సారి సెక్షన్ 43 కింద దేవాదాయ శాఖ ఈ రోజు ఈమెయిల్ ద్వారా నోటీసులు జారీ చేసింది. మే 30వ తేదీన రూపొందించిన ఈ నోటీసులు ట్రస్ట్ కు ఆలస్యంగా అందాయి. అయితే కోర్టు తీర్పునకు లోబడి ప్రక్రియ ఉంటుందని నోటీసుల్లో పేర్కొంది దేవాదాయ శాఖ.