ఏపి ప్రభుత్వం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నేడు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ నోటిపికేషన్ విడుదల చేసింది.
ఎస్టీ కమిషన్ ఏర్పాటుపై డిప్యూటి సీఎం పుష్ప శ్రీవాణి స్పందించారు. ప్రత్యేక ఎస్టీ కమిషన్ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని అన్నారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గిరిజనులకు ఇచ్చిన హామీని నెరవేర్చారని అన్నారు. గిరిజనుల హక్కులు కాపాడేందుకు ఎస్టీ కమిషన్ తీసుకువచ్చారని ఆమె పేర్కొన్నారు. గిరిజనులు అందరూ సీఎం జగన్ కు రుణపడి ఉంటారని పుష్ప శ్రీవాణి అన్నారు.