ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లోని అధికారులకు సైతం హై కోర్టు AP high court మెట్లు ఎక్కడం ఆనవాయితీగా మారుతోంది. నెలకు రెండు మూడు సార్లైనా హైకోర్టుకు వెళ్ళడం అక్కడ కోర్టు చివాట్లు తినడం అధికార గణానికి అలవాటుగా మారుతుంది. చిన్నచిన్న కేసులకు సైతం పెద్దవి చేసుకుంటూ… అధికారులు న్యాయ వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే మాటను మూటగట్టుకుఅంటున్నారు. పరిపాలనాపరమైన అంశాలను పరిష్కరించడంలో ఎక్కడో లోపం మరెక్కడో నిర్లక్ష్యం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ అధికారుల్లో కనిపిస్తోంది. వరుసగా రెండు రోజుల పాటు హైకోర్టు ఓ ఎస్ ఐ కు పదోన్నతి విషయంలోనూ, ఓ అటెండరుకు పదోన్నతి కల్పించడంలోనూ అధికారులు ప్రవర్తించిన నిర్లక్ష్యాన్ని వారు తీసుకున్న చర్యలను కోర్టు తీవ్రంగా ఖండించడమే తో పాటు మందలించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
కోర్టు ఆదేశాలు పట్టవా?? AP high court
ఓ వ్యక్తి లేదా ఓ సంస్థ తమ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు న్యాయం జరగడం లేదని భావించినప్పుడు కోర్టులను ఆశ్రయించడం రివాజు. దానిని కోర్టు పరిశీలించి సంబంధిత అధికారులందరికీ నోటీసులు జారీ చేస్తుంది. వచ్చి దాని తాలూకు అంశాలను వివరించాలని సూచిస్తుంది. రాజ్యాంగంలో అత్యున్నత వ్యవస్థ గా పేర్కొన్న న్యాయ వ్యవస్థ ఆదేశాలను అంతా తప్పక పాటించాలి. అయితే రాష్ట్ర అధికారులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం వారు రకరకాల దారుల్లో కోర్టుకు డుమ్మా కొడుతున్నారు. ఒక్కోసారి వారు చెప్పే కారణాలు సైతం కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి సైతం చాలా హాస్యాస్పదంగా ఉంటున్నాయి. మొన్నటికి మొన్న ఓ ఎస్సై పదోన్నతి వివాదంలో డిజిపి కోర్టుకు రాలేనని సమర్పించిన అఫిడవిట్ ను తప్పుబట్టిన కోర్టు నిన్న ఓ అటెండర్ విషయంలో అధికారులు చూపించిన అలసత్వాన్ని ఎండగట్టింది. అంతే కాదు అధికారుల కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు విషయంలో అంత సీరియస్ వరకు తెచ్చుకోవాల్సిన ఆగత్యం ఏముంది అన్నది అధికారులు గుర్తించాలి. ప్రతిసారి హైకోర్టు చీవాట్లు తినడం హైకోర్టు నుంచి మొట్టికాయలు తినడం అలవాటుగా మారిన అధికారులు… భవిష్యత్తు తరాల అధికార గణానికి ఏం సందేశం చెబుతారు అన్నది న్యాయనిపుణుల ప్రశ్న.
ప్రభుత్వ తీరు అలాగే! AP high court
న్యాయవ్యవస్థ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగిస్తున్న అంశాలను, తీరును అధికారగణం సైతం ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే హైకోర్టుకు ప్రభుత్వానికి నడుమ ఎన్నో బేధాభిప్రాయాలు పలు కేసుల్లో విభిన్నమైన తీర్పు దృష్ట్యా… కోర్టులను తులనాడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు సైతం రచ్చాకేక్కరు. ప్రస్తుతం ఏపీలోని చాలామందిలో కోర్టులు… ప్రభుత్వం తీసుకునే చర్యలు అన్నిటిని వ్యతిరేకిస్తుంది అనే భావన కలిగించేలా ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు అధికారులకు అలవాటు అయినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం దారిలోనే అధికారగణం కూడా ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. జిల్లాస్థాయి కోర్టులే ఆదేశిస్తే రాష్ట్ర స్థాయి అధికారులు హాజరై సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలను సైతం అధికారులు అసలు వెళ్ళని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో నెలకొనడం విచిత్రంగా ఉందని న్యాయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని హైకోర్టు ఆదేశం రాగానే నోటీసు అందగానే అధికారులు వేగంగా స్పందించే వారు దానికి తగినట్లుగా… సంసిద్ధులై కోర్టుకు వచ్చేవారని ప్రస్తుతం ఆ పరిస్థితి అధికారులు కనిపించడం లేదన్నది హైకోర్టు లాయర్లు చెబుతున్న మాట. అంటే క్రమంగా అధికార గణానికి ప్రభుత్వానికి న్యాయవ్యవస్థ మీద నమ్మకం పోతుందా లేక న్యాయవ్యవస్థను కావాలనే చిన్నచూపు చూసే చర్యలకు పూనుకున్నా రా అన్నది వారికే తెలియాలి. అయితే ఒకటి మాత్రం నిజం న్యాయవ్యవస్థను తక్కువ చేసి చూస్తే రాజ్యాంగాన్ని తక్కువ చేసి చూసినట్లే… అది భవిష్యత్తు తరాలకు తప్పుడు సంకేతాలను ఇస్తోంది అనడంలో సందేహం లేదు.