Breaking : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏలూరు పరిధిలో ఓటర్ల జాబితా అంశంలో దాఖలైన పిటిషన్ పై సోమవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. వార్డుల పునర్విభజన, జనగణన సరిగా లేదంటూ పిటిషన్ తరపు న్యాయవాది వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. ఇరుపక్షల వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల నిర్వహణ నిలిపివేయాలని ఆదేశించింది.
కాగా ఎంపిటీసి, జడ్పిటీసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ లపై విచారణ జరిపింది. గత ఏడాది నామినేషన్ ల ప్రక్రియ సందర్బంలో బెదిరింపులు, బలవంతపు విత్ డ్రా లు జరిగాయని జనసేన పిటిషన్ లో పేర్కొంది. దీనిపై ఎన్నికల సంఘానికి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేలా ఆదేశించాలని జనసేన పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు కోర్టు ను కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పు ను రిజర్వులో పెట్టింది.