Tirupati: తిరుపతి జిల్లా రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్తికేయ అనే చిన్న పిల్లల ప్రైవేట్ ఆస్పత్రిలో
ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడే ఉంటున్న వైద్యుడు కుటుంబం మంటల్లో చిక్కుకు పోయింది. ఈ ఘటనలో వైద్యుడుతో పాటు కుమారుడు, కుమార్తె సజీవ దహనం చెందారు. హాస్పిటల్ పైఅంతస్తులో డాక్టర్ రవిశంకర్ కుటుంబం నివాసం ఉంటుంది. దీంతో మంటల్లో చిక్కుకుపోయిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ ల సహాయంతో మంటాలను అదుపు చేస్తున్నారు.
రేణిగుంట పట్టణం భగత్ సింగ్ కాలనీలో కార్తికేయ పేరుతో డాక్టర్ రవి శంకర్ రెడ్డి ఆసుపత్రిని నడిపిస్తున్నారు. కాగా ఆదివారం ఉదయం ఆయన కుటుంబం నివాసం ఉంటున్న అంతస్తులు ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో వెంటనే స్థానికులు గమనించి రవిశంకర్ రెడ్డి భార్య ఇంకా అత్తతో పాటు ఆయన కుమారుడు భరత్(12) కుమార్తె కార్తీక(15) లను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే డాక్టర్ రవి శంకర్ రెడ్డితో పాటు కుమారుడు కుమార్తె సజీవ దహనమైనట్లు తెలిసింది.
కొనఊపిరితో ఉన్న ఇద్దరు చిన్నారులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా ఇద్దరు కూడా మరణించడం కుటుంబంలో విషాదం నిలిపింది. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ అని అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ పెను ప్రమాదం సంభవించిన సమయంలో హాస్పిటల్ లో రోగులు ఎవరు ఉండకపోవడం తో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.