తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం.. మైనారిటీ ఓటు బ్యాంకును మరింత పదిలంగా ఆయనకు అందిస్తోం దని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి మైనారిటీలు ఇప్పటికే వైసీపీకి అండగా ఉన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఢోకా లేదు. అయితే.. కూటమి పార్టీలు జత కట్టిన తర్వాత.. కొంత తేడా వస్తుందని అనుకున్నారు. అయినప్పటికీ.. బీజేపీతో చేతులు కలపడంతో మైనారిటీ ఓటు బ్యాంకు వైసీపీతోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇలాంటి సమయంలో మైనారిటీ ఓటు బ్యాంకును మరింత చేరువ చేసుకునేందుకు జగన్ మరో కీలక స్టెప్ వేశారు. తాజాగా కర్నూలులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో జగన్.. వచ్చే రెండేళ్ల తర్వాత.. తాను ఏం చేయాలనుకున్నదీ చెప్పారు. అదే.. ఇక్కడి సీటును ఆశించి, ఇవ్వలేకపోయిన నేపథ్యంలో అసంతృప్తిలో ఉన్న హఫీజ్ఖాన్కు ఆయన రాజ్యసభసీటును ఎనౌన్స్ చేశారు. నిజానికి రాజ్యసభకు ఇప్పటి వరకు మైనారిటీ వర్గాలు.. గత 20 ఏళ్లలో ఎవరూ వెళ్లలేదు.
పార్టీలు ఏవైనా కూడా.. వైసీపీ సహా ఇప్పటి వరకు మైనారిటీలను.. రాజ్యసభకు పంపించలేదు. దీనినే జగన్ అస్త్రంగా మార్చుకున్నారు. కొన్నాళ్లుగా మైనారిటీ వర్గాల్లోనూ ఈ తరహా చర్చ ఉంది. తమ నాయకు డు పార్లమెంటులో ఉంటే బాగుంటుందని అనుకున్నారు. కానీ, సాధ్యంకావడం లేదు. దీనిని గమనించిన జగన్ మైనారిటీలను ఆకట్టుకునేలా హఫీజ్ ఖాన్కు ఇప్పుడే టికెట్ ప్రకటించేశారు. అయితే.. ఇది నెరవేర డానికి రెండేళ్ల సమయం ఉంది. 2026 వరకు ఏపీలో రాజ్యసభ స్థానాలు ఖాళీ లేవు.
ఎలా చూసుకున్నా.. మైనారిటీ ఓటు బ్యాంకును ప్రభావితం చేసేలా జగన్ వేసిన.. వ్యూహం.. సక్సెస్ అవు తుందనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో గత ఎన్నిక ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక, ఇప్పుడు జగన్ చేసిన ఈ ప్రకటన ఒక్క కర్నూలు పైనే కాకుండా.. గుంటూరు, నెల్లూరు వంటి ముస్లింలు ఎక్కువగా ఉన్న జిల్లాలపైనా ప్రభావంచూపుతుందని అంటున్నారు పరిశీలకులు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!