JD Lakshminarayana: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అనుకున్నట్లుగానే సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. జై భారత్ నేషనల్ (జేబీఎన్పీ) పేరుతో పార్టీని ఆయన ప్రకటించారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్పూర్తితో పని చేశానని పేర్కొన్న లక్ష్మీనారాయణ.. అన్ని వర్గాల ప్రజలను కలిసి అభిప్రాయాలు తీసుకున్నానన్నారు.
రాజకీయాలు అంటే మోసం కాదనీ, సుపరిపాలన అని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగానికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా రాకపోవడమేనని అన్నారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో అన్ని పార్టీలూ విఫలమైయ్యాయని విమర్శించారు. ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని పేర్కొన్నారు. వీళ్లు తిన్నారని వాళ్లు, వాళ్లు తిన్నారని వీళ్లు విమర్శించుకుంటున్నారని అన్నారు. ఎవరూ అవినీతికి పాల్పడలేని వ్యవస్థను తీసుకొచ్చేందుకే పార్టీ స్థాపించానని చెప్పారు. అభివృద్ధితో అవసరాలు తీర్చేందుకు.. బానిసత్వాన్ని రూపుమాపేందుకు పుట్టిందే జేబీఎస్పీ అని లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే .. జై భారత్ నేషనల్ పార్టీ 2018లోనే జి చిన్నయ్య దొర ప్రారంభించారు. ఏపిలోని సామర్లకోట కు చెందిన చిన్నయ్య దొర ఢిల్లీ కేంద్రంగా పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో దేశంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించినా ఆ దిశగా అడుగులు పడలేదు. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ అదే రాజకీయ పార్టీ పేరుతో ప్రకటన చేయడం గమనార్హం. చిన్నయ్య దొర స్థాపించిన పార్టీనే లక్ష్మీనారాయణ తీసుకున్నారా.. లేక అదే పేరుతో రాష్ట్ర పార్టీగా ఆరంభించారా అనేది తెలియాల్సి ఉంది.
YSRCP Fact Check: గోదావరి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ ఇన్ చార్జిల మార్పు ..? వైసీపీ రెండో జాబితా వైరల్