KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊహించని షాకిస్తూ, అంచనాలు తలకిందులు చేస్తూ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ నేత రఘునందన్ రావు విజయం సాధించిన సంగతి తెలిసిందే. తనదైన శైలిలో కామెంట్లు చేసే రఘునందన్ రావు తాజాగా గులాబీ దళపతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన షాక్ కు గురయ్యే కామెంట్లు చేశారు. భద్రాద్రి రాముని సన్నిధిలో కేసిఆర్ ప్రభుత్వం పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రగిలిపోయే మాట మాట్లాడారు.
రఘునందన్ రావు ఏమంటున్నారంటే…
తన కంటే హిందువు లేడు… తానే పెద్ద హిందువును అని తెలంగాణ కేసీఆర్ భావిస్తున్నాడని… అయితే అది నిజం కాదని రఘునందన్ అన్నారు. భద్రాచలం దేవాలయానికి కేసిఆర్ ప్రభుత్వం 100 కోట్లు ప్రకటించి ఏండ్లు గడుస్తున్న ఇప్పటికి ఆ మాటను గుర్తుంచుకోక పోవటం బాధకరమన్నారు. రామాలయానికి ఇస్తానన్న 100 కోట్ల విలువ….కేసిఆర్ కట్టిన ప్రగతి భవనం, కవిత అడిన బతుకమ్మ అంత ఖరీదు కాదని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నిజంగా హిందువు అయితే…భద్రాద్రి రామాయ్యకి 100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనకు చేత కాదని.. చేతిలేత్తినట్లయితే కేంద్ర ప్రభుత్వం సహాయంతో నెలరోజుల్లో రామాలయానికి 100 కోట్లు తెస్తామని రఘునందన్ రావు స్పష్టం చేశారు. రాముడి పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే కేసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాములోరి దర్శనానికి వచ్చారా…? అని ప్రశ్నించారు. ఉత్తరాదిన నిర్మిస్తున్న రామా మందిరాన్ని భద్రాద్రి రాములోరి ఆశీస్సులతో త్వరలోనే పూర్తి చేసుకుంటామని తెలిపారు.