Gannavaram (Krishna): కృష్ణాజిల్లా ఆట్యా పాట్యా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఉమ్మడి కృష్ణాజిల్లాల బాల బాలికల (అండర్ -14) జట్ల ఎంపిక గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త డి నాగరాజు తెలిపారు. 2009 జనవరి ఒకటవ తేదీ తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులు. బాలురు వయస్సు, ఎత్తు బరువు మొత్తం 240పాయింట్లు, బాలికలు 230పాయింట్లు కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఎంపిక సమయానికి వయస్సు ధ్రువీకరణ పత్రం, ఆధార్ తో హాజరు కావాలని నాగరాజు కోరారు. ప్రతిభ కనభరిచిన క్రీడాకారులను గుర్తించి జూలై 1, 2తేదీలలో తూర్పు గోదావరి జిల్లా తుని లో జరిగే ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల సబ్ జూనియర్ ఆట్యా పాట్యా పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. వివరాలకు 9490798909 నంబర్ లో సంప్రదించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్ క్రీడా పాఠశాల లో4, 5 తరగతి ప్రవేశానికి మంగళవారం నాడు గన్నవరం మండల స్థాయి ఎంపికలు బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం లో నిర్వహించడం జరిగింది. మండల ఎంపిక కమిటీ సభ్యురాలు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిమ్మగడ్డ రవీంద్ర భవాని ఎంపికలను ప్రారంభించారు. ఎత్తు బరువు, 800మీటర్లు పరుగు, 30మీటర్లు పరుగు, స్థాండింగ్ బ్రాడ్ జంప్ తదితర క్రీడాంశాలలో ఎంపికలు నిర్వహించినట్లు ఎంపిక కమిటీ కన్వీనర్ ధనియాల నాగరాజు తెలిపారు. బాలురలో మాత్రమే ఎంపికలకు హాజరు అయినట్లు బాలికల ప్రాతినిధ్యం లేదని నాగరాజు తెలిపారు. ఎంపికలకు హాజరైన వారిలో ముగ్గురు బాలురు ఈ నెల23, 24తేదీలలో గుడివాడ లో జరిగే జిల్లా స్థాయి ఎంపికలకు అర్హత సాధించినట్లు నాగరాజు తెలిపారు. ఎంపిక కార్యక్రమం లో గుడ్ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ చిప్పాడ చంద్ర శేఖరరావు, పీఈటీ మీరాసాహెబ్, రాజు పాల్గొని ఎంపికలు నిర్వహించారు.
TTD: జూన్ 29 నుండి తిరుపతిలో చతుర్వేద హవనం