MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ ఇరుపక్షాల వాదోపవాదాలు, ఉద్రిక్తతల నడుమ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మద్య పోటీ నువ్వా నేనా అన్నరీతిలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులు ఆసక్తిగా ఈ ఎన్నికలను గమనిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఓట్లను లెక్కిస్తారు. ఎన్నికల నేపథ్యంలో 50 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. తెలంగాణ కో ఆపరేటివ్ సొసైటీ రిటైర్డ్ ఉద్యోగుల తో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మా లో మొత్తం 925 మంది సభ్యులు ఉండగా వీరిలో 883 మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. 500 మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
MAA Elections: ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ సినీనటులు
సినీ ప్రముఖులు కృష్ణ, చిరంజీవి, నందమూరి బాల కృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సుమన్, బ్రాహ్మనందం, పోసాని, నరేశ్ ఇలా నటీ నటులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడంతో ఎన్నికల అధికారి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఘర్షణ పడితే పోలింగ్ నిలిపి వేస్తామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రం బయట ఇరు ప్యానెల్స్ ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన వారు పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని, రిగ్గింగ్ కు పాల్పడ్డారని విష్ణు వర్గం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొద్ది సేపు పోలింగ్ నిలుపుదల చేశారు. ఎన్నికల అధికారి హెచ్చరిక నేపథ్యం లో ఇరువర్గాలు శాంతించడంతో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
శివ బాలాజీ చేయి కొరికిన హేమ
కొందరు ప్యానెల్ సభ్యులు లోపలికి వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంచు మోహన్ బాబు మండిపడినట్లు తెలుస్తోంది. మరో వైపు శివ బాలాజీ, హేమల మధ్య వాగ్వివాదం చేటుచేసుకుంది. మధ్యాహ్నం 11.30 గంటల సమయానికి 350 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా సాయంత్రం 4 గంటల తరువాత ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత ఈ సీ సభ్యుల ఫలితాలు వెల్లడిస్తాారు. చివర్లో అధ్యక్షుడి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల తరువాత అధ్యక్షుడి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.