NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వివేకా హత్యపై తొలిసారిగా మీడియా ముందు స్పందించి కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇవేళ విచారణకు హజరు కాలేననీ, తమకు సమయం కావాలని ఆయన సీబీఐకి లేఖ రాశారు. సీబీఐ లేఖపై అవినాష్ రెడ్డి స్పందిస్తూ.. నిన్న నోటీసులు ఇచ్చి ఈ రోజు విచారణకు హజరుకావాలని పేర్కొన్నారన్నారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల ఇవేళ విచారణకు హజరు కావడం లేదని చెప్పారు. కనీసం రోజుకు రెండు మూడు వందల మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేసే కార్యక్రమం ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నానని చెప్పారు. అందుకే నాలుగైదు రోజులు విచారణకు గడువు కోరాననీ, ఆ తర్వాత ఎప్పుడు విచారణకు నోటీసులు ఇచ్చినా వారి ముందు హజరై వారు అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం ఇస్తానని తెలిపారు.

YS Avinash Reddy

 

గత రెండున్నర సంవత్సరాలుగా తనపై, తన కుటుంబంపైనా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ కు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు అవినాష్ రెడ్డి. కోర్టులో ట్రయిల్ మాత్రం ప్రారంభం కాలేదు కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం తనపైన, తన దగ్గరి వారిపైనా అసత్య ఆరోపణలు చేస్తూ వచ్చాయన్నారు. ఏనాడూ తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదన్నారు. ఈ సబ్జెక్ట్ పై మాట్లాడటానికి తన మనసు అంగీకరించడం లేదనీ, ఆ అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. తానేమిటో, తన వ్యక్తిత్వం ఏమిటో, తన వ్యవహారా శైలి ఏమిటో ఈ జిల్లా ప్రజలందరికీ బాగా తెలుసునని అన్నారు.

MP Avinash Reddy

 

ప్రతి ఒక్కరినీ తాను మనవి చేసేది ఏమిటంటే న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలని దేవుడిని కోరుకోవాలని, తాను అదే కోరుకుంటున్నానన్నారు. మీడియా కూడా నిజం గెలవాలని కోరుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతే తప్ప కంక్లూజన్స్ డ్రా చేయవద్దని హితవు పలికారు. ఇటువంటి అభియోగాలు మోపి కారెక్టర్ అసాసినేషన్ చేస్తే దగ్గరి వాళ్లు ఎంత బాధపడతారో అర్ధం చేసుకోవాలన్నారు. మీకుటుంబాల్లో ఏమైనా జరిగితే మీకు ఆ బాధ తెలుస్తుందని మీడియాను ఉద్దేశించి అన్నారు. మీడియా బాధ్యతగా వ్యవహరించాలని నిజం గెలవడానికి కృషి చేయాలని కోరారు అవినాష్ రెడ్డి.

YS Viveka Murder Case: సీబీఐ విచారణకు సహకరిస్తా .. కానీ

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju