NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు .. పోలీస్ ఆంక్షల మధ్య రుషికొండ పరిశీలన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విశాఖలో కొనసాగుతోంది. జగదాంబ జంక్షన్ లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన పవన్ కళ్యాణ్ ఇవేళ రుషికొండను పరిశీలించారు. అయితే రుషికొండ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. పవన్ కారుతో పాటు మరో ఏడు కార్లను పోలీసులు అనుమతి ఇచ్చారు. నోవాటెల్ నుండి రుషికొండ కు పది కిలో మీటర్ల దూరం ఉండగా, జనసేన కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా రుషికొండకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ పర్యటిస్తున్న మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు, జోడుగుళ్లపాలెం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

 

రుషికొండ వద్దకు వాహనాలను అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ కాలినడకన వెళ్లి అక్కడ వాహనం ఎక్కి నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రను దోపీడీ చేస్తున్నారని విమర్శించారు. రుషికొండ నిర్మాణాలకు అన్ని అనుమతులు వచ్చాయా అని ప్రశ్నించారు.  తుఫాన్లు వచ్చినప్పుడు రుషికొండ కాపాడుతుందని అన్నారు. ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులపై వైసీపీ నేతల కళ్లు పడ్డాయని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణను కూడా ఇలాగే దోచేశారని అన్నారు. జగన్ కు ఎన్ని ఇళ్లు కావాలని ప్రశ్నించారు. వైసీపీ నేతల దోపిడీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలన్నారు.

 

కాగా, రుషికొండ పర్యటనకు ముందు పవన్ కళ్యాణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిన్న జరిగిన సభలో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల నోటీసుల్లో మూడు సూచనలు, మరో మూడు ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తొంది. వాటిని అనుసరించాలని పోలీసులు నోటీసులో ప్రస్తావించారు. వారాహి యాత్రలో భాగంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దనీ, నిరాధార ఆరోపణలు చేయవద్దని, వర్గ విభేదాలు సృష్టించే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. అలాగే జనసేన తరపున ఏర్పాటు చేసే కార్యక్రమ షెడ్యుల్ ముందుగానే తెలియజేయాలని, శాంతి భద్రతల విఘాతం కల్గించబోమని హామీ ఇవ్వాలని, పోలీసు నిబంధనలు పాటించాలని విశాఖ పోలీసులు పేర్కొన్నారు.

 

మరో పక్క పవన్ రుషికొండ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించడాన్ని జనసేన తప్పుబట్టింది. రుషికొండ నిషిద్ద ప్రాంతమా అని ప్రశ్నించింది. రుషికొండ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు పరిశీలించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళుతున్నారు అన్న సమాచారం అందుకున్న పోలీసులు రుషికొండ కు వెళ్లే మార్గాలను దిగ్బందనం చేశారని జనసేన పేర్కొంది. సామాన్య ప్రజలను సైతం కనీసం వెళ్లనివ్వలేదనీ, రుషికొండ పర్యటాక ప్రాంతమైనప్పటికీ నిషిద్ద ప్రాంతంగా మార్చేశారని విమర్శించింది. రుషికొండ కు వెళ్లే అన్ని మార్గాలను బారికేట్లతో మూసివేసి పక్క దేశం వెళ్లినట్లుగా మార్చారని పేర్కొంది. రుషికొండ ప్రాంతం పూర్తి నిషిద్ద ప్రాంతంలో ఉందా లేక పాకిస్తాన్ లో ఉందా అన్నట్లుగా పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నట్లుగా అనిపించలేదని జనసేన విమర్శించింది.

YS Sharmila: ఢిల్లీలో వైఎస్ షర్మిల .. విలీనంపై కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు..?

Related posts

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju