ఏలూరు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2002 లో ఏలూరులో ధనా బ్యాంకు డైరెక్టర్ లు డిపాజిటర్లను మోసం చేశారు. డిపాజిటర్లను మోసం చేసినందుకు గానూ 21 మందిపై పోలీసులు డిపాజిటర్స్ యాక్ట్ కేసు నమోదు కాగా, ఈ కేసులో నిందితులపై నేరం రుజువు అయినందున ఏలూరు సెషన్స్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ కేసులో రూ.3కోట్ల డిపాజిట్లు గల్లంతు అయినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సత్యసాగర్ సహా 21 మందికి ఏలూరు సెషన్స్ కోర్టు జైలు శిక్ష విధించింది.