విశాఖ శారదాపీఠంలో జనవరి 27వ తేదీ నుండి 31వ తేదీ వరకూ అయిదు రోజుల పాటు వార్షికోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ వార్షికోత్సవాల సందర్భంగా రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిజీ గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని సీఎం జగన్ ను కలిశారు. దుశ్సాలువాతో సత్కరించి శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవాల్లో పాల్గొని రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు పొందాలని సీఎం జగన్ కు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కోరారు. స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిజీ వెంట సీఎం ను కలిసిన వారిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
జగన్మోహనరెడ్డి అధికారంలోకి రావడం కోసం ఎన్నికలకు ముందు స్వరూపానందేంద్ర స్వామి వారి ఆధ్వర్యంలో ఏడాది పాటు ప్రత్యేక యజ్ఞాలు, యాగాలు, పూజలు నిర్వహించారని ప్రచారం జరిగింది. అందుకే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు మార్లు విశాఖ శారదా పీఠాన్ని దర్శించుకుని స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్వరూపానందేంద్ర స్వామిజీకి భక్తుడిగా అత్యంత గౌరవం ఇస్తుండటంతో పలువురు మంత్రులు కూడా శారదాపీఠాన్ని దర్శిస్తూ స్వామిజీ ఆశీస్సులు పొందుతున్న సంగతి తెలిసిందే.
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్ జగన్కు అందజేసిన శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి pic.twitter.com/au8pFJueqc
— YSR Congress Party (@YSRCParty) December 15, 2022