వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ లు పాల్గొన్న ఈ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు ఇస్తున్నట్లు గుడ్ న్యూస్ చెబుతూనే..పనితీరు ఆధారంగానే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానంటూ బ్యాడ్ న్యూస్ చెప్పారు. తన మీద అలిగినా ఫరవాలేదు. పని చేయని వాళ్లకు మాత్రం టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని కరాఖండిగా తేల్చి చెప్పేశారు. తనతో పాటు ఎమ్మెల్యేలు కలిసి పని చేస్తేనే వచ్చే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలు గెలుస్తామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని కొందరు సీరియస్ గా తీసుకోవడం లేదనీ, అయిదురు ఎమ్మెల్యేలు కేవలం అయిదు రోజుల్లోనే ముగించారని చెప్పారు. మొత్తం ఎమ్మెల్యేల అందరి ప్రొగ్రెస్ రిపోర్టును సమీక్షలో బయటపెట్టిన జగన్ .. చురకలు అంటించారు.
ఇంకా సమయం ఉంది ఇప్పటి నుండి అయినా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని నియోజకవర్గాల్లో తిరగాలనీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఫీడ్ బ్యాక్ తీసుకావాలన్నారు. నియోజకవర్గాల్లో అత్యవసర పనులకు ఎమ్మెల్యేకు రూ.2కోట్లు చొప్పున విడుదల చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నిధులు కాక గ్రామ సచివాలయ పరిధిలో అత్యవసర పనులు చేపట్టేందుకు రూ.20 లక్షల వంతున నిధలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గడప గడపకు వెళ్లినప్పుడు ప్రజల నుండి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని ప్రాధాన్యతా పనుల కోసం ఈ నిధులు ఖర్చు చేయాలని చెప్పారు.
ఒక నెలలో ఎమ్మెల్యేలు తిరిగే సచివాలయాల్లో పనులకు సంబంధించి ముందుగానే కలెక్టర్ కు డబ్బు ఇవ్వనున్నామని తెలిపారు. వెంటనే పనులు ప్రారంభమయయేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా రానున్న నెల రోజుల్లో ఏడు సచివాలాయలను ఎమ్మెల్యేలు సందర్శించాలని స్పష్టం చేశారు. వచ్చే నెల రోజుల్లో కనీసంగా 16 రోజులు, గరిష్టంగా 21 రోజులు గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేసేందుకు 175 నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించాలని ఆదేశించారు.
పొరపాటున ద్రౌపది ముర్ముకు ఓటు వేసి నాలుక కర్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క