YSRCP New MLC Candidates Oath: గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నియమితులైన నలుగురు వైసీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, రమేష్ యాదవ్ లు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపి అసెంబ్లీలో సోమవారం ప్రొటైం చైర్మన్ బాల సుబ్రమణ్యం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు రంగనాథబాబు, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత, టీ వనిత, ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నూతనంగా ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి అభినందనలు తెలియజేశారు.
గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.