నరేంద్ర మోడీ ప్రభుత్వం మరొకసారి చైనా పై ఉక్కుపాదం మోపింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంతో విశ్లేషించి తయారు చేసిన సమగ్ర నివేదికల ఆధారంగా చైనాకు చెందిన 43 యాప్స్ ను ఐటీ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
ఇక ఈ బ్లాన్ చేసే యాప్ జాబితాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. సామాన్యుల భద్రతకు ఈ అప్లికేషన్లు ప్రమాదమని కేంద్రం పేర్కొనడం గమనార్హం. ఇక ఈ నిర్ణయంతో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 43 మొబైల్ యాప్స్ నిషేధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 29 ఏ కింద ఉత్తర్వులను జారీ చేసింది.
భారతదేశం యొక్క రక్షణ రాష్ట్ర భద్రత వంటి అంశాలు కు సంబంధించి వచ్చిన నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటివరకు చైనా కు సంబంధించిన యాప్స్ ను భారతదేశం 200 వరకు నిషేధించినట్లు అయింది. గతంలో మొదటి విడతలో యూసీ బ్రౌజర్, యూసి న్యూస్, షేర్ ఇట్ యాప్ లతోపాటు 59 ఆప్స్ పై కేంద్ర ప్రభుత్వం విధించిన విషయం తెలిసిందే. రెండవ విడతలో పాపులర్ మల్టీప్లేయర్ గేమ్ పబ్జి తో సహా 118 ఆప్స్ ను బ్యాన్ చేసింది. ఇక ఇప్పుడు అలీ ఎక్ష్ప్రెస్స్ తో సహా 43 యాప్స్ ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. అలీసప్లియర్స్ మొబైల్ యాప్
అలీబాబా వర్క్బెంచ్ అలీ ఎక్స్ప్రెస్
– స్మార్ట్ షాపింగ్, బెటర్ లివింగ్
అలిపే క్యాషియర్
లాలామోవ్ ఇండియా – లాలామోవ్ ఇండియాతో డెలివరీ యాప్
డ్రైవ్
స్నాక్ వీడియో క్యామ్కార్డ్
– బిజినెస్ కార్డ్ రీడర్
కామ్కార్డ్
బిసిఆర్ (వెస్ట్రన్) సోల్
చైనీస్ సోషల్ – ఉచిత ఆన్లైన్ డేటింగ్ వీడియో యాప్ & చాట్
డేట్ ఆసియా – డేటింగ్ & ఆసియా సింగిల్స్ ఫర్ చాట్
వే డేట్ –డేటింగ్ యాప్
ఫ్రీ డేటింగ్ యాప్
అదోర్ యాప్
ట్రూలీ చైనీస్… ఇలా మరికొన్ని యాప్స్ ని ఇండియా బ్యాన్ చేసింది.