AP By Elections: మనం మొన్ననే ఒక కథనంలో చెప్పుకున్నాం.. తిరుపతి ఎన్నిక పోలింగ్ కి ముందు ఓ స్పష్టమైన కథనంలో 2017 నంద్యాల ఉప ఎన్నికకు.. 2021 తిరుపతి ఎంపీ ఉన్న ఎన్నికకు పోలిక, సారూప్యత వివరించాం.. ఇప్పుడు ఈ కథనంలో తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ రోజు జరిగిన వివాదాలు.., దొంగ ఓట్లు బాగోతంలో నిజాలు.. నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ రోజు ఏం జరిగింది..!? మొత్తం కాస్త లోతుగా చర్చిద్దాం..!
AP By Elections: ముందు మాట – తిరుపతిలో ఏం జరిగింది..!?
ఎస్… తిరుపతిలో ఉప ఎన్నిక సందర్భంగా దొంగ ఓట్లు పోలయ్యాయి. ఎన్ని ఓట్లు అనేది చెప్పలేం.. ఎన్ని వేలు ఓట్లు అనేది తేల్చలేం.. కానీ బోగస్ ఓట్లు పడడం మాత్రం ఖాయంగా పేర్కొనవచ్చు. అందుకు అనేక ఆధారాలు, సాక్ష్యాలు కూడా సోషల్ మీడియాలో వెలుగు చూశాయి. ఫేక్ ఐడెంటిటీ కార్డులు.. ఫేక్ ఓటరు స్లిప్పులు.. ఫేక్ పేర్లు పెట్టుకుని వచ్చేసారు. అక్కడి వరకు ఒకే. బీజేపీ/ టీడీపీ వారి అనుకూల మీడియాలు కూడా ఆ దొంగ ఓట్ల భరతం పట్టడంలో కొంతమేరకు సఫలీకృతమయ్యాయి. ఇది వైసీపీ ఆత్మహత్యా సదృశ్యమే. నిజానికి తిరుపతి ఉప ఎన్నిక స్వేచ్ఛగా.. ఎటువంటి పొరపాట్లు, ఇటువంటి ఘోరాలు లేకుండా జరిగితేనే వైసిపికి భారీ మెజారిటీ వస్తుంది. ఈజీగా రెండు లక్షలు మెజారిటీ వచ్చేది. కానీ ఎందుకో ఇలా ప్రయత్నాలు చేసింది. ఏం సాధిద్దామనో ఇలా తప్పులకు దొరికేసింది..! ఇది వైసీపీ చేసింది.. కానీ టీడీపీ అనుకూల మీడియా మరింత ఓవర్ యాక్షన్ చేసింది. సాధారణ పౌరులను కూడా దొంగ ఓటర్లు అనేలా అనుమానించి అతి భజన చేశారు. ఇక్కడితో అయిపోలేదు.. టీడీపీ మంచిదే అని భుజాలు చరుచుకుంటే పప్పులో కాలేసినట్టే.. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ చేసిన అరాచకాలను ఒక సారి గుర్తు చేసుకోవాలి..!
read It ; నంద్యాల – తిరుపతి నిజాలు ఇద్దరూ గ్రహించాలి..!!
నంద్యాలలో బాబోరు చేసిందిదీ..!!
నంద్యాలలో 2017 లో ఉప ఎన్నిక జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. టీడీపీ.. వైసీపీ రెండూ గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. నిజానికి అక్కడ వైసీపీ బలంగా ఉంది. కానీ అధికారంలో ఉన్నాం కాబట్టి.., గెలవాలని పట్టుదలతో దిగింది. భారీగా డబ్బులు వెదజల్లించి. టీడీపీ సుమారుగా రూ. 80 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఒక్కో ఓటుకి కూడా 2 వేలు వరకు ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఓటుకి రూ. 3 , 4 వేలు కూడా ఇచ్చారు. భారీగా డబ్బు ఖర్చు చేసి.., ప్రతిపక్షాన్ని భయపెట్టి.. వైసీపీ నేతలను బెదిరించి.. లొంగదీసుకుని అప్పట్లో టీడీపీ పోల్ మేనేజ్మెంట్ భారీగా చేసింది. ఎన్నికల రోజు కూడా.. క్యూ లైన్లలో కూడా డబ్బులు ఇచ్చారు. పోలీసులు, అధికారులు, ఇతర జిల్లాల నాయకులను రంగంలోకి దించిన టీడీపీ … ఇన్ని ప్రయత్నాలతో 27 వేల ఆధిక్యతతో గెలిచింది. సో.. నంద్యాలలో జరిగిన దానికి ఒక అడుగు ముందుకేసి .. ఫేక్ ఓట్ల ద్వారా తిరుపతిలో వైసీపీ మరో సంస్కృతికి తెరతీసింది.
ఎన్నికల సంఘం ఏం చేస్తుంది..!?
ఎన్నికలు అంటే ప్రతిష్టాత్మకం.. గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తారు. ప్రచారాలు చేస్తారు. డబ్బులు పెడతారు. కానీ ఏపీలో దశలు దాటేస్తుంది. ఎన్నికల అక్రమాల్లో కొత్త పుంతలు తొక్కుతుంది. డబ్బులు విచ్చలవిడిగా పెడుతున్నారు. ఓట్లు నకిలీవి సృష్టిస్తున్నారు. అసలైన ఓటర్లు ఓటు వేయకముందే వారి ఓటు పోలైపోతుంది. డబ్బులు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇవన్నీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలే. బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో డబ్బు ప్రభావం తక్కువ ఉంటుంది కానీ.. రిగ్గింగ్.. కిడ్నాప్ లు.. కొట్లాటలు, భారీ గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఏపీలో ఇవన్నిటితో పాటూ డబ్బు కూడా విచ్చలవిడిగా మారుతుంది. అంటే ఏపీలో సంకృతి మారిపోతుంది. ఎన్నికల్లో డబ్బు పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు అదే విధానం జగన్ కూడా చేయడంతో దెబ్బ తిన్నారు.. ఇన్ని జరుగుతున్నా ఏపీలో.. ఇండియాలో ఎన్నికల సంఘం ఏం చేస్తుంది..? సోషల్ మీడియాలో వీడియోలు.., మీడియాలో ప్రసారాలు చూడడం.. వాటిని పట్టించుకోవడం మానేసినట్టుంది..!!