మిగతా ప్రాంతాల్లో తక్కువే…
ఢిల్లీతో పోల్చుకు ముంబై బెటరే…
స్లమ్స్లో 57 % రెసిడెన్షియల్ ఏరియాల్లో 16% విస్తృతి
దేశాన్ని వణికిస్తున్న కరోనా రీసెర్చ్ లో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయ్. కరోనా దేశ రాజధానిపై పంజా విసరడం సాధారణ జీవితం అస్తవ్యస్థమైపోయింది. తాజాగా ముంబైలో జరిపిన మెడికల్ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయ్.
ప్రతి ఆరుగురిలో ఒకరికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అదే సమయంలో ముంబై మురికివాడల్లో 57 శాతం మంది మహమ్మారిబారిన పడ్డారు. ఇతర రెసిడెన్షియల్ కాలనీల్లో ఈ సంఖ్య 16 శాతమేనని సర్వే తేల్చింది. ఈనెల 15 వరకు జరిగిన సర్వేలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయ్.
వ్యాధిని తట్టుకునే శక్తి ఉన్న యాండీబాడీస్ శాతాన్ని సర్వేలో వైద్యులు గుర్తించేందుకు ప్రయత్నించారు. గతంలో వ్యాధికి గురైనవారిలో మాత్రమే యాండీబాడీస్ను నిపుణులు గుర్తించారు. ఒక్క ముంబైలోనే ప్రస్తుతం లక్షకు పైగా నమోదుకాగా…. దేశంలోని కేసుల్లో 7 శాతం ముంబైలోనే ఉన్నాయ్.
కోటి 20 లక్షల జనాభా ఉన్న ముంబైలో 65 శాతం ప్రజలు స్లమ్స్లోనే ఇరుకిరుకు గదుల్లో జీవనం సాగిస్తున్నారు. నీతి అయోగ్, మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై , టాటా రీసెర్చ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయ్. అదే సమయంలో మహిళల్లో యాంటీబాడీస్ అధికంగా ఉన్నట్టు సర్వేలో తేలింది. చాలా మందికి కరోనా వచ్చినట్టుగా కూడా తెలియకపోవడం విశేషం. ఇలాంటి వారిలో మరణాలు కూడా 0.05 నుంచి 0.10 లోపు ఉండటం స్లమ్స్లో ఉన్నవారిలో రోగనిరోధక శక్తిని చాటుతున్నాయ్.
దేశ రాజధాని ఢిల్లీలో 23.48 శాతం మంది కోవిద్ బారినపడ్డట్ట గత వారం సర్వే ఫలితాలు వెల్లడించింది. చాలా మందిలో ఎలాంటి లక్షణాలు లేకపోవడం వల్ల వ్యాధి వ్యాప్తి పెరిగే అవకాశమున్నట్టు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఢిల్లీతో పోల్చుకుంటే ముంబైలో కరోనా వ్యాధి విస్తృతి కొంత తక్కువన్నట్టుగా తెలుస్తోంది. అయితే జనభా లెక్క చూస్తే ఢిల్లీ కంటే ముంబైలో కేసులు ఎక్కువ. మహారాష్ట్రలోనూ కేసులు సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ… గత కొంత కాలంగా కేసులు సంఖ్య తగ్గుతూ వస్తోంది.