Fuel Prices : ప్రస్తుతం దేశంలో వాహనదారులు పెట్రోల్ బంకు కి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. రోజుకొక కొత్త రికార్డు సాధిస్తూ ఆకాశాన్నంటుతున్న ధరలు చూసి బెదిరిపోతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 24 విడతలుగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేని అధిక ధరని అందుకున్నాయి. దీనంతటికీ కారణం ఏమిటని ప్రజలు ప్రశ్నలు, విమర్శలు గుప్పిస్తున్నారు.
కేంద్రం జనాల గోడు వినదా?
అసలు ఒక్కసారిగా ఇలా కేంద్రం ధరలు పెరగడానికి కారణం టాక్స్ ల మోత అని తెలుస్తోంది. ఎక్సైజ్, వ్యాట్ టాక్స్ ల రూపంలో ప్రభుత్వాలు బాదుడికి దిగటంతోనే కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ కొట్టేసింది. పెట్రోల్ పంపుల్లోని రిటెయిల్ రేట్లలో 67 శాతం దాకా ట్యాక్స్లే ఉంటున్నాయంటే పరిస్థితి క్లియర్గా అర్థమవుతోంది. కరోనా వల్ల ఏర్పడిన నష్టంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు పెట్రోల్. డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ టాక్స్ పెంచింది. మేమేమి తక్కువ కాదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ టాక్స్ లను భారీగా విధించింది. అంతే…. జనాలకు దిక్కుతోచడం లేదు. అక్టోబర్ నుండి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆయిల్ రేట్లు పెరిగిన విషయం నిజమే… కానీ టాక్సుల భారాన్ని ప్రజలపై తగ్గించాలని ప్రభుత్వం మాత్రం అనుకోలేదు ఇది గమనించదగ్గ పాయింట్.
Fuel Prices – పన్నులే పన్నులు…
మరొకవైపు జీఎస్టీ కింద కైనా పెట్రోల్, డీజిల్ లను తేవాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. ఎలాగో టాక్స్ లు తగ్గించలేదు కనీసం జిఎస్టి కింద కైనా వస్తే ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి కానీ దీనికి కేంద్రం సానుకూలంగా ఉంది…. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. 2014 వరకు రిటైల్ రేట్లలో ట్యాక్స్ మొత్తం 45 శాతం గా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం లీటర్ పెట్రోల్ ధర లో 67 శాతం ఎక్సైజ్ ఉండగా… ముడి చమురు ధర కేవలం 33 శాతం అని చెబుతున్నారు. దేశంలో అవసరాలలో దాదాపు 85 శాతం దిగుమతుల ద్వారానే నెరవేరుతోంది. దీనికోసం విలువైన ఫారిన్ ఎక్సేంజ్ కూడా వెచ్చించాల్సి వచ్చింది.
అదొక్కటే దారి…!
ఇక మన మోడీ గారు ఏమంటున్నారు అంటే…. చమురు వెలికితీత విషయంలో సొంత కాళ్లపై నిలబడేందుకు గత ప్రభుత్వాలు కృషి చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురయ్యిందిఅట. అతను రెండు విడతలు ప్రధానమంత్రిగా ఉన్నారు మరి ఈ విషయం పై వారి ప్రభుత్వం ఏమి చేసిందో సమాధానం మాత్రం ఇవ్వడం లేదు. ఇక మొన్న జనవరి నెల నుండి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్లను ప్రతిరోజు సవరించడం మొదలుపెట్టారు. కరోనా కారణంగా 82 రోజులపాటు చేయనిది ఒక్కసారిగా మొదలు పెట్టేసరికి రోజురోజుకీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇక నేచురల్ గ్యాస్ జీఎస్టీ పరిధిలోకి రావచ్చు అని మోదీ ప్రకటించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తర్వాత పెట్రోల్, డీజిల్ లకి కూడా జీఎస్టీ మాత్రమే వసూలు చేయాలని కస్టమర్లు కూడా కోరుతున్నారు. అయితే అది మాత్రం అంత సులువు కాదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకసారి అన్ని పన్నులను రద్దు చేసి కేవలం జీఎస్టీ మాత్రమే వసూలు చేయడం చాలా కష్టం అని వాదిస్తున్నారు.