ముందు నుయ్యి వెనుక గొయ్యి… ఇదీ రాజు గారి నయా సీన్
ఆయన లోకల్ వార్తల నుంచి ఇంటర్నేషనల్ వార్తల వరకు ఏపీకి ముడిపెట్టి ఓ రేంజ్ లో తెలుగు ప్రేక్షకులకు వీనుల విందు వడ్డిస్తున్నారు. పేరుకు వైసీపీ ఎంపీ అని నేమ్ ప్లేట్ లో పెట్టుకున్నప్పటికీ ఆయన ఆ పార్టీని మాత్రం గబ్బుపట్టించే వ్యూహంలో పూర్తిగా దిగిపోయారు.
ఇప్పుడా విషయం జోలికి ఎందుకులే గానీ… ఇక్కడో విషయం చెప్పాలి. మీడియా ముఖంగా, ట్విట్టర్ వేదికగా ప్రతి చిన్న అంశాన్ని బాగా విడమర్చి చెప్పే రఘురామకృష్ణజు ఏపీకి వచ్చిన బీజేపీ చీఫ్ కు మాత్రం శుభాకాంక్షలు చెప్పలేదు. ఎందుకో ఏమో… ఇద్దరూ గోదావరి జిల్లా వారే. అయిన విషయం కానీ విషయం రెంటినీ దబాదబా వాయించే రాజుగారు సోముకు అభినందనలు గానీ… ధ్యాంక్స్ కానీ రెండు కూడా చెప్పకపోవడం కొంచెం ఇంటరెస్టింగ్ పాయింటే. నిన్నట్నుంచి ఆయన ట్విట్టర్ ఎకౌంట్ చూస్తుంటే సీఎంకు లేఖలుంటాయ్. కేంద్ర మంత్రులను కలిసిన సందర్భాలుంటాయ్. కానీ సోము వీర్రాజు వ్యవహారం అసలే కన్పించలేదు.
రాజుగారి తీరు చూస్తే ఒక రోజు ఆయనకు తెలియని విషయం మరోటి ఉండదన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే అన్ని విషయాలపై ఆయనకు ఆ మాత్రం గ్రిప్ ఉన్నట్టుగానే ఉందనుకోవాల్సి ఉంటుంది. సరే మళ్లీ అసలు విషయానికి వస్తాం… ఇప్పుడు రాజు గారు టీడీపీ నేతలు మాట్లాడమన్నట్టు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. వాస్తవానికి మొన్నటి వరకు వారంతా కూడా బెస్ట్ ఫ్రెండ్స్. టీడీపీ నుంచి ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజు ఆ తర్వాత రాజకీయంగా వేసిన అడుగు ఎంపీగా చేసింది. 2014 ఎన్నికల ముందు బీజేపీలో చేరినా ఆయనకు సీటు రాలేదు. పైపెచ్చు ఆయన కుటుంబ సభ్యులనే బరిలోకి దించి గెలిపించింది కమలం పార్టీ. అదే సీటు నుంచి 2019లో అనూహ్యంగా విజయం సాధించిన రాజు ఆ తర్వాత బీజేపీ పెద్దలకు బాగా టచ్ లో ఉంటూ ఆయనకు ఓ రెప్యూటేషన్ సాధించేశారు.
అయితే ఇప్పుడు సోము వీర్రాజును బీజేపీ చీఫ్ గా నియమించడంతో రాజుగారి మాటలకు కొంత బ్రేక్ పడుతుందేమోననుకోవాల్సి ఉంటుంది. వైసీపీని విమర్శించడం వెనుక టీడీపీ పెద్దలున్నారని సోము స్టైల్లో మాట్లాడితే అది కాంట్రవర్శీ అవడం ఖాయం. ఇద్దరి మధ్య టర్మ్స్ బాగానే ఉంటే రఘరామరాజు ఈ పాటికే సోముకు ఓ రేంజ్ లో వెల్కమ్ బోర్డ్ పెట్టేసేవారే. లేకుంటే ఇద్దరికి గ్యాప్ ఉందో… ఏదైనా తేలాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే. రాజుగారు ఎంత మొహమాటం లేకుండా మాట్లాడతారో… సోము కూడా అంతే… ఇప్పుడు ఢిల్లీలో చేస్తున్న పంచాయతీలకు కొంత బ్రేక్ పడటం ఖాయమనుకోవాల్సిందేనా…