మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ హత్య జరిగి 16 నెలలు కావస్తోంది. ఇప్పటికీ ఈ ఉదంతంపై ఎవరూ ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ప్రత్యర్డులు హత్య చేశారా? కుటుంబీకులే హత్య చేశారా? ఆయనే ఆత్మహత్య చేసుకున్నారా? గుండె పోటా? అసలు ఏం జరిగింది? ఒక హత్య చుట్టూ ఇన్ని కోణాలు తిరుగుతున్నాయి. దీనిపై పోలీసులు కూడా రంగప్రవేశం చేసి సీరియస్ గా దర్యాప్తు చేసినప్పటికీ ఎ విషయం తేల్చలేకపోయారు. దాదాపు పది నెలల పాటు పోలీసులు ముప్పుతిప్పలు పడినప్పటికీ, వందలాది మందిని విచారించినప్పటికీ ఒక స్పష్టత రాక కేసు వదిలేశారు. ఈ క్రమంలోనే ఈ కేసు దర్యాప్తు చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ రంగంలోకి దిగింది. గడచిన 15 రోజులుగా అత్యంత కీలకంగా ఈ దర్యాప్తు సాగుతోంది.
ఇకపై వైఎస్ కుటుంబంపై గురి
రెండు వారాల నుండి దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ ఇప్పటికే దాదాపు 50 మందిని విచారించింది. వివేకానంద రెడ్డి ఇంటి పనిమనుషులు, నైట్ వాచ్ మెన్, అయన సమీప బంధువులు సహా అనేక మందిని విచారించిన సిబిఐ ప్రస్తుతం వైఎస్ కుటుంబీకులను విచారించే పనిలో పడింది. రేపు లేదా ఎల్లుండి నుంచి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, ఇతర వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కొందరిని సిబిఐ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న పదిహేను రోజుల పాటు ఇలా కడప జిల్లాలో వైయస్ వివేకానంద రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపార ప్రత్యర్థులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, అందరూ దాదాపు మరో వంద మందిని విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రానున్న రెండు వారాల్లో వీరిని విచారించే క్రమంలో ఏమైనా అదనపు దర్యాప్తు అవసరమైతే కొంత మందిని కస్టడీ లోకి కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదిఏమైనా రాష్ట్రంలో సంచలనానికి దారి తీసిన ఈ హత్య కేసును త్వరగా పురోగతి సాధించి నిజానిజాలు నిగ్గు తేల్చాలని వైఎస్ అభిమానులు సహా రాష్ట్ర ప్రజలు కూడా కొంత మంది కోరుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?