యావత్తు ప్రపంచం విపత్తుతో విలవిలలాడుతుంది. సమాజంలో ఊహించని వైపరిత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు స్వాంతన చేకూరేవిదంగా ఎవరికి తోచిన సహయం వారుచేస్తుంటారు.
వారివారి రంగాలద్వారా ప్రజలను చైతన్యం చేస్తు భయాందోళనలను తొలగిస్తుంటారు. ప్రాణాంతర కరోన వైరస్ ప్రజలను కాటేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో కళాలు. గళాలు సడిచప్పుడు లేకుండా మూగబోయయా… అనే ప్రశ్న ఊత్పన్నం అవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో అనాధిగా ఆట, పాటకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. భారత స్వాతంత్ర్యపోరాటం మొదలుకుని, భూమికోసం భూక్తికోసం సాగిన తెలంగాణ సాయుదపోరాటం అయినా… విప్లవ పోరాటాలు లయినా… మలి, తొలి దశ తెలంగాణ ఉద్యమాలు అయినా… సందర్భం ఏదైనా ఆట, పాటకు ఉన్న పాత్ర అంతా ఇంత కాదు. సమస్య పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, చైతన్యం చేయడంలో కవులు, కళాకారులు ప్రముఖ పాత్ర పోషించారు. ముందువరుసలో నిలబడ్డారు.
కానీ తెలంగాణ సమాజం యావత్తు చాలా క్లిష్టపరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ప్రాణాంతక కరోన వైరస్ నుండి తప్పించుకుని తిరగడం ఎలా… వైరస్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి… దురద్రష్టవశాత్తు కరోన వ్యాపిస్తే ఏలా ముందుకు వెళ్లాలి… ఇలా అనేకానేక అనుమానాలు గ్రామీణా ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. ప్రసార, ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికి… కవులు, కళాకారులు తమ ఆట, పాట ద్వారా చేసే ప్రయత్నం ప్రజలకు ఈజీగా అర్ధం అవుతుందనేది అందరి వాదన. తెలంగాణ రాష్ట్రం అనేక మంది కవులు, కళాకారులకు పుట్టినిల్లు. అనేక మంది కవులు కళాకారులు తమ ప్రతిభ ద్వారా ప్రజల ఆధరాభిమానాలు సొంతం చేసుకున్నారు.
ప్రజాయుద్ద నౌక గద్దర్, అరుణోదయ విమలక్క, రచయిత, గాయకుడు గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, ముఖ్యమంత్రి ఓఎస్డి దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సాయిచంద్, నేర్నాల కిషోర్… ఇలా అనేకమంది కళాకారులు విపత్తు సమయంలో పోషించాల్సిన పాత్రను విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ క్షేత్రస్థాయిలో తిరిగి కాలుకు గజ్జేకట్టి ప్రజలను చైతన్యం చేస్తే కరోన వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందనా భావిస్తే అనేక వేదికలు ఉన్నాయి. టీవీ చానళ్లు, సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలను భయాందోళనలను తొలగించవచ్చు అనే వాదన ఉంది.
సుధాకర్….