Sharwanand: టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్గా కిశోర్ తిరుమల దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సీనియర్ స్టార్ హీరోయిన్లు రాధికా శరత్ కుమార్, ఖుష్బు సుందర్, ఊర్వశిలు ఇందులో కీలక పాత్రలను పోషించారు.
అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం రేపే(మార్చి 4) విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ బిజినెల్ లెక్కలు నెట్టింట వైరల్గా మారాయి.
వాటి ప్రకారం.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 15.50 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో ఇప్పుడీ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ. 16 కోట్లను రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఒకరకంగా శర్వాకు పెద్ద టార్గెట్ అనే చెప్పాలి. ఎందుకంటే, శర్వా నటించిన గత ఐదు చిత్రాలు బాక్సాఫీస్ ఘోరంగా బోల్తా పడ్డాయి.
దీంతో `ఆడవాళ్ళు మీకు జోహార్లు`తో ఎలాగైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని శర్వా ఆశపడుతున్నాడు. కానీ, ఇప్పుడు బయటకు వచ్చిన ప్రీ రిలీజ్ బిజినెస్ లక్కలు చూస్తుంటే శర్వా ఆశ నెరవేరుతుందా..? అన్న అనుమానులు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. వీరి అనుమానులు శర్వాను మరింత టెన్షన్ పెడుతున్నాయని టాక్.