Adivi Sesh: టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ ఒకరు. 2010లో విడుదలైన `కర్మ` అనే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఈయన.. కెరీర్ ఆరంభంలో సహాయక పాత్రలను, విలన్ పాత్రలను పోషించాడు. 2016లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ `క్షణం`తో పూర్తి స్థాయి హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆపై వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు చేరువైన అడివి శేష్.. త్వరలోనే పాన్ ఇండియా హీరోగా మారబోతున్నాడు. ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం `మేజర్`.
26/11 ముంబై ఉగ్ర దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రమిది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ మూవీలో అడివి శేష్ మేజర్ సందీప్ గా కనిపించబోతున్నాడు. సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా… శోభితా ధూలిపాళ్ల కీలక పాత్రను పోషించింది. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిలింస్ ఇండియా బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, ఆర్మీలో చేరాలన్న కోరిక, సైన్యంతో కలిసి పని చేయడం, ముంబై దాడి లో వీరమరణం.. ఇలా ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నీ చూపించబోతున్నారు. కొద్ది నెలల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూన్ 3న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వరుస ఇంటర్వ్యూల్లో, టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్న హీరో అడివి శేష్.. ఓ తీపి కబురు చెప్పాడు. తాజాగా శేష్ సోషల్ మీడియా వేదికగా `ఆస్క్ శేష్` పేరుతో చిట్ చాట్ సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన అన్ని ప్రశ్నలకు శేష్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఈ క్రమంలోనే ఓ నెటిజన్ `సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తే.. రిపీటెడ్ ఆడియన్స్ పెరుగుతారు, కలెక్షన్స్ బాగా వస్తాయి, ఇండస్ట్రీని కూడా కాపాడుకోవచ్చు` అని సూచించాడు. దానికి వెంటనే శేష్ బదులిచ్చారు. మేజర్ పాన్ ఇండియా చిత్రమైనా టికెట్ రేట్లను పెంచడం లేదని, సాధారణ రేట్లకే ఈ మూవీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని ఆయన పేర్కొన్నాడు. దాంతో సినీ ప్రియులు మరియు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల ఎఫ్ 3 మూవీ టీమ్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. `ఎఫ్ 3` చిత్రానికి టికెట్ ధరలు పెంచడం లేదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే తమ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామని నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు.