Archana Jois: కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `కేజీఎఫ్ చాప్టర్ 1` ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు. దీనికి కొనసాగింపుగా వచ్చిన `కేజీఎఫ్ 2` కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పార్ట్ 2.. విడుదలైన అన్ని భాషల్లోనూ భారీ కలెక్షన్స్ను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోంది.
అయితే ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న వారిలో అర్చన జోయిస్ ఒకరు. కేజీఎఫ్ సినిమాలో యష్ తల్లి పాత్రను ఈమె పోషించింది. నిజానికి ఆమె వయసు పాతికేళ్లే అయినా.. ఈ చిత్రంలో వయసుకు మించిన పాత్ర చేసి ఆడియోన్స్ను ఆకట్టుకుంది. చిన్న తనం నుంచీ నృత్యమంటే ప్రాణమిచ్చే అర్చనా.. 21 ఏళ్లకే `మహాదేవి` అనే కన్నడ సీరియల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఈ సీరియల్లో అర్చనను చూసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్లో హీరో యశ్కు తల్లిగా చేయమని అడిగారు. తల్లి పాత్ర అనగానే మొదట నో చెప్పిన అర్చనా.. ఆ తర్వాత దర్శకుడు ఇచ్చిన భరోసాతో ఓకే చెప్పిందట. కట్ చేస్తే ఆమె పాత్రకు విశేష ఆదరణ లభించింది. సినిమాలో ఈమె కనిపించేది తక్కువ సమయమే అయినా.. అర్చన పాత్ర సినిమాకు ఆత్మ లాంటిదని చెప్పాలి.
ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన అర్చన జోయిస్.. టాలీవుడ్ హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఎన్టీఆర్ తనకెంతో క్యూట్గా అనిపిస్తారని, ఆర్ఆర్ఆర్లో ఆయన నటన చూసి ఫిదా అయ్యాయని పేర్కొన్న అర్చన.. ప్రభాస్ రాబోయే చిత్రం సలార్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే అర్చన మహేష్ గురించి కూడా మాట్లాడింది. `మహేష్ గురించి మొదట తెలుసుకున్నప్పుడు ఆయనకు పెళ్లయిందా..? పిల్లలు ఉన్నారా..? అని ఆశ్చర్యపోయా. ఆయన సౌత్ మోస్ట్ హ్యాండ్సమ్ స్టార్. మహేష్ అసలు పెళ్లైన వారిలానే కనిపించరు` అంటూ ఆమె పేర్కొంది. దీంతో ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.