యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ , హై టెక్నికల్ వేల్యూస్ చిత్రం `సాహో`. శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను ఆగస్ట్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ ఎహ్సాన్ లాయ్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో నిర్మాణ సంస్థ వారి స్తానంలో మరో బాలీవుడ్ సంగీత దర్శకుడినే తీసుకు రావాలని సన్నాహాలు చేస్తుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ప్రీతమ్ అనే బాలీవుడ్ దర్శకుడితో యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్.
previous post
next post