అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వై,ఎస్. జగన్ మోహన్ రెడ్డి వృద్ధాప్య పించన్ రెండు వేల రూపాయల నుంచి 2250 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన ఫైలుపై మొదటి సంతంకం చేశారు. ఈ పెరుగుదల జూన్ నుంచే అమలులోకి వస్తుంది.
పాదయాత్రలో ఆయన వృద్ధాప్య పించను మూడు వేల రూపాయలకు పెంచుతానని వాగ్దానం చేశారు. ఆ విధంగానే నాలుగేళ్లలో పించను మూడు వేలకు చేరుతుందని జగన్ ప్రకటించారు. ప్రతి ఏడూ 250 రూపాయల చొప్పున నాలుగేళ్లలో పించన్ మూడు వేల రూపాయలకు చేరుకుంటుందని ఆయన చెప్పారు.