Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఐదింటిలో ఈ ఏడాది రెండు రిలీజ్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. జూన్ నెలలో ఆది పురుష్, సెప్టెంబర్ నెలలో సలార్ విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే మరోపక్క మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కొద్దిగా షూట్ కూడా జరిగింది. అతి తక్కువ టైంలో ఈ సినిమాని కంప్లీట్ చేసేలా మారుతి ప్లాన్ చేస్తున్నారు. కామెడీ… యాక్షన్ మరియు త్రిల్లర్ నేపథ్యంలో స్క్రిప్ట్ ఉండనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ తాతగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటించనున్నారట. ఆల్రెడీ సంజయ్ దత్ కొన్ని సంవత్సరాల నుండి సౌత్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్ సెకండ్ పార్ట్ లో ఘనంగా కనిపించడం జరిగింది. అయితే ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాలో ప్రభాస్ తాతగా చాలా పాజిటివ్ రోల్ లో సంజయ్ దత్ నీ చూపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసే తరహాలో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకి “డిస్కో రాజా” అనే టైటిల్ కూడా ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా ఈ సినిమా అతి తక్కువ టైంలో కంప్లీట్ చేస్తానని దర్శకుడు మాట ఇవ్వటంతో పాటు స్క్రిప్ట్ నచ్చడంతో ప్రభాస్ ఒప్పుకున్నట్లు.. ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం “సలార్” సినిమా చేస్తున్న ప్రభాస్..”ప్రాజెక్ట్ కే” కూడా కంప్లీట్ చేస్తున్నారు. “ప్రాజెక్ట్ కే” వచ్చే ఏడాది సంక్రాంతి టైములో రిలీజ్ చేయనున్నారు.