Aacharya: కొద్ది నెలల క్రితం సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇండస్ట్రీ తరఫున చిరంజీవి పెద్ద తరహా పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. టికెట్ ధరల విషయంలో మొదట వైయస్ జగన్ ని వ్యక్తిగతంగా చిరంజీవి కలవడం జరిగింది. ఇండస్ట్రీ సమస్యలను..టికెట్ ధరలు తగ్గిస్తే నిర్మాతలు ఎదుర్కొనే ఇబ్బందులు సీఎం దృష్టికి చిరంజీవి తీసుకొచ్చారు. ఆ తర్వాత హీరో ప్రభాస్, మహేష్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి, పోసాని కృష్ణ మురళి, ఆలీ మరికొంత మందితో కలసి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో చిరంజీవి మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో చిరంజీవి ఇండస్ట్రీ తరపున అనేక సమస్యలు వివరిస్తూ చేతులు జోడించి మాట్లాడటంతో.. అది పెద్ద ఇష్యూగా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వివిధ పార్టీల రాజకీయ నాయకులు చిరంజీవి … వైయస్ జగన్ ముందు చేతులు జోడించడం పట్ల..వైసీపీ నీ టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఈ విషయంపై ఆచార్య ప్రమోషన్ కార్యక్రమాల్లో చిరంజీవి రియాక్ట్ అయ్యారు. జగన్ ముందు చేతులు జోడించి నమస్కారం చేశారు.., మీకు చిన్నతనంగా అనిపించలేదా..? అనే ప్రశ్న ఎదురయింది. దీనికి చిరంజీవి ప్రతిస్పందిస్తూ.. నేను ఆ పని చేసింది చిత్ర పరిశ్రమ కోసం. అంతేగాని నా ఒక్కడి సినిమా కోసం కాదు. ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది అంటే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని క్లారిటీ ఇచ్చారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఏప్రిల్ 29వ తారీకు “ఆచార్య” విడుదల అవుతోంది. దీంతో “ఆచార్య” సినిమా టీం ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. ఈరోజు “ఆచార్య” నిర్మాత మరియు హీరో చరణ్ విజయవాడలో ఇంద్రకీలాద్రి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో చరణ్, చిరంజీవి కలసి ఫుల్ లెంగ్త్..గా ఫస్ట్ టైం నటించడంతో ఈ సినిమా చూడటానికి అభిమానులతో పాటు సామాన్య సిని జనాలు కూడా ఆత్రుతగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున “ఆచార్య” రిలీజ్ అవుతుంది.