ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్, మరో నిర్మాత శింగమలరమేష్లపై నాంపల్లి సిఐడి కోర్టు కేసు కొట్టివేసింది. వివరాల్లోకెళ్తే 2010లో శింగనమల రమేష్ పవన్ కల్యాణ్తో కొమురం పులి, మహేష్తో ఖలేజా సినిమాలు నిర్మించాడు. ఈ సినిమా వీడియో హక్కులను తమకు ఇస్తామని ఇవ్వలేదని, అడిగితే భానుకిరణ్ అనే వ్యక్తితో తమను బెదిరించారని ప్రముఖ వీడియో సంస్థలు షాలిమార్, యూనివర్సల్ కోర్టులో కేసు వేశాయి. దాదాపు తొమ్మిదేళ్ల పాటు కేసు నడిచింది. చివరకు సరైన ఆధారాలు లేని కారణంగా సీఐడీ కోర్టు కేసును కొట్టివేసింది.
previous post
next post