Adipurush: బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆదిపురుష్” టీజర్ అక్టోబర్ మూడవ తారీకు రాముని జన్మస్థలం అయోధ్యలో విడుదల చేయడం తెలిసిందే. “ఆదిపురుష్” టీజర్ చూసి అభిమానులు ఎంతగానో నిరాశ చెందారు. అసలు గ్రాఫిక్స్ ఏమీ బాగోలేదని.. దారుణమని కామెంట్లు చేస్తున్నారు. మరొక పక్క “ఆదిపురుష్” టీజర్ పై భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. అయితే సినిమా ధియేటర్ నీ దృష్టిలో పెట్టుకుని “ఆదిపురుష్” చేసినట్లు నిర్మాతలు మరియు దర్శకులు చెప్పడం జరిగింది. సెల్ ఫోన్ ఇంకా యూట్యూబ్ లో “ఆదిపురుష్” టీజర్ చూసి నిరాశ ఎంత వద్దని కూడా చెబుతున్నారు.
ఇలాంటి తరుణంలో అక్టోబర్ ఆరవ తారీకు “ఆదిపురుష్” టీజర్ 3Dలో విడుదల చేయడం జరిగింది. హైదరాబాద్ ఏఎంబి మాల్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రభాస్ తో పాటు డైరెక్టర్.. నిర్మాతలు పాల్గొన్నారు. “ఆదిపురుష్” టీజర్ 3D విడుదల అనంతరం ప్రభాస్ మీడియాతో మాట్లాడుతూ…”నేను ఫస్ట్ టైం చూసి చిన్న పిల్లాడి లాగా అయిపోయాను. మంచి అనుభూతి కలిగింది. అక్టోబర్ 7వ తారీకు రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 60 థియేటర్లలో “ఆదిపురుష్” టీజర్ 3D ప్రదర్శితం అవుతుంది. కచ్చితంగా ఫ్యాన్స్ చూసి థ్రిల్ అవుతారు. ఈ సినిమా బిగ్ స్క్రీన్ కోసమే చేశాను. త్వరలో మరో అద్భుతమైన కంటెంట్ తో వస్తామని ప్రభాస్ స్పీచ్ ఇచ్చారు.
ఇంకా సినిమాలో పలు పాత్రలపై వస్తున్న విమర్శలకు ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ఓమ్ రౌత్ స్పందించారు. “రావణుడి పాత్ర ఖిల్జినీ పోలీ ఉందనేది నిజం కాదు. పురాణాలను ప్రేమించే వాడిని నేను. చేతను అపహరించిన రావణుడు క్రూరుడు. రావణుడిని గంభీరంగానే చూపించాను. ఆయన పాత్ర స్వరూపాన్ని మార్చలేదు. 95 సెకండ్ ల టీజర్ లో పాత్రలను అంచనా వేయలేమని వస్తున్న విమర్శలపై ఓమ్ రౌత్ కౌంటర్లు వేశారు.