RC15: టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఒక సినిమాను రూ. 25 కోట్లు బడ్జెట్తో తెరకెక్కిస్తుంటాడు. అదే భారీ బడ్జెట్ చిత్రమైతే ఓ అరవై, డబ్బై కోట్ల వరకు ఖర్చు పెడుతుంటారు. కానీ, ఈయన ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో ఒక్క పాట, ఫైట్కే రూ. 25 కోట్లు ఖర్చు చేశారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని శంకర్తో చేస్తున్న సంగతి తెలిసిందే.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. సునీల్, శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
ఇంతకీ మ్యాటరేంటంటే.. ఈ చిత్రంలో ఓ పాట, ఫైట్ చిత్రీకరణ కోసం శంకర్ ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేశారట. ఇప్పటికే ఆ పాటను రామోజీ ఫిలింసిటీలో షూట్ చేయగా..దానికి రూ.9కోట్లు ఖర్చు అయిందట. అలాగే పది కోట్లకు పైగా బడ్జెట్తో ఓ ఫైట్ ఎపిసోడ్ చిత్రీకరించారట. ఎంత వరకు నిజమో తెలీదు గానీ.. ఈ విషయం నెట్టింట మాత్రం హాట్ టాపిక్గా మారింది.
ఏదేమైనా ఓ పాట, ఫైట్కే రూ. 20 కోట్లంటే మామూలు విషయం కాదు. వాస్తవానికి దిల్రాజు రూ. 250 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా మొత్తాన్ని నిర్మించాలనుకున్నారు. కానీ, శంకర్ దెబ్బకు అనుకున్న లెక్కలన్నీ తారుమారు అయిపోతున్నాయి. మరి ఈ సినిమా కంప్లీట్ అయ్యే టైమ్కి బడ్జెట్ ఎంత అవుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.