Big Breaking: “ఆచార్య” సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 23 వ తారీకు ఏపీలో విజయవాడలో సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో జరగనున్నట్లు ఉదయం వార్తలు మీడియాలో రావడం తెలిసిందే. పైగా ఇదే సమయంలో ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ఏపీ సీఎం జగన్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఉన్నట్టుండి హఠాత్తుగా ఈ నెల 23 వ తారీఖున విజయవాడలో జరగాల్సిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో నిర్వహించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అవ్వడం జరిగిందట. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండగా ఆఖరి నిమిషంలో ప్రీ రిలీజ్ వేదిక మార్పు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.మరి ఇటువంటి తరుణంలో విజయవాడ నుండి హైదరాబాద్ కి ప్రీ రిలీజ్ వేడుక వేదిక సినిమా యూనిట్ మార్చడంతో సీఎం జగన్ ముఖ్యఅతిథిగా వస్తారా..? లేదా..? లేకపోతే జగన్ స్థానంలో మరో ముఖ్య అతిథి వస్తారేమో అనే డిస్కషన్స్ ఇప్పుడు అభిమానులలో స్టార్ట్ అయ్యాయి. ఆఖరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాలవల్ల విజయవాడ నుండి హైదరాబాద్ కి వేదిక మార్చటం జరిగిందట. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ నటించిన “ఆచార్య” పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ టైం చిరంజీవి, చరణ్ కలిసి లాంగ్ లెన్త్ గా… ఈ సినిమాలో నటిస్తుండటంతో.. ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూడటానికి… అభిమానులు ఆరాటపడుతున్నారు. ఏప్రిల్ 29వ తారీకు “ఆచార్య” భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. పైగా ఈ సినిమాకి నిర్మాతగా కూడా చరణ్ వ్యవహరిస్తూ ఉండటంతో… ప్రమోషన్ కార్యక్రమాలు వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. దీనిలో భాగంగా రీసెంట్ గా కొరటాల శివ, చిరంజీవి, చరణ్ సరదాగా సినిమా గురించి అనేక విషయాలు చర్చించుకున్న వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో బాగా వైరల్ అవ్వుతోంది.