Mahesh Rajamouli: “బాహుబలి” తో దేశంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఇమేజ్ ప్రపంచంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇమేజ్ తో పాటు తన వ్యక్తిగత ఇమేజ్ అమాంతం పెంచేసి కొన్నాడు దిగ్గజ దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమా తో ఇండియన్ స్టాండర్డ్స్ ఫిలిం మేకింగ్ లో కొత్త లెక్కలు ప్రపంచ వ్యాప్తంగా సృష్టించడం జరిగింది. 1000 కోట్లతో సినిమా నిర్మించి ఆ తరహాలోనే హాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు వసూలు చేయగా… ఆ తరహాలోనే సినిమాలు… కొన్ని వందల కోట్లతో నిర్మించి.. అతి తక్కువ బడ్జెట్లోనే… హాలీవుడ్ సినిమాలు కలెక్షన్లు కొల్లగొట్టే రీతిలో… బాహుబలి తో కలెక్షన్లు సాధించాడు రాజమౌళి. కాగా ఇప్పుడు RRR తో.. సరికొత్త రికార్డులు సృష్టించడానికి జక్కన్న రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభమైన నాటి నుండి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. సినిమా ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉండగా… వాయిదా పడుతూ వచ్చింది.
అయితే ఇటీవల జనవరి 7వ తారీకు సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేద్దామని రాజమౌళి ప్రీ రిలీజ్ వేడుకలు కూడా ప్రారంభించగా.. కొన్ని చోట్ల ప్రీ రిలీజ్ వేడుకలు ఘనంగా జరగగా సరిగ్గా విడుదల సమయంలో.. దేశంలో కరోనా విజృంభించడంతో.. సినిమా థియేటర్లపై ఆంక్షలు విధించడంతో…RRR రిలీజ్ వాయిదా పడటం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచర్ తరహాలో.. సినిమా స్టోరీ ఉండబోతున్నాడు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.
కాగా పాన్ ఇండియా నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. పరిస్థితి ఇలా ఉంటే ఈ సినిమాలో మహేష్ కి ప్రతినాయకుడి పాత్రలో తమిళ స్టార్ హీరో విక్రమ్ నీ నటింపజేయడానికి రాజమౌళి ప్లాన్ చేసినట్లు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకుగానూ విక్రమ్ కూడా ఓకే అన్నట్లు భారీగా రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో.. సర్కారు వారి పాట, త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్ అయిన వెంటనే రాజమౌళి సినిమా స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. మహేష్ రాజమౌళి కాంబినేషన్ కావటంతో ఈ ప్రాజెక్ట్ పై ఒక తెలుగులో మాత్రమే కాక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా అంచనాలు ఉన్నాయి.