మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఈ క్రమంలో వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమాపై భారీ అంచనాలు ఫ్యాన్స్ పెట్టుకున్నారు. “SSMB 28” అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం షూటింగ్ జరుపుకోవడానికి రెడీగా ఉంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ జూన్ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. “సర్కార్ వారి పాట” సినిమా విజయం సాధించటంతో మహేష్ కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లడం ఆగస్టు తొలి వారంలో రావడం జరిగింది.
అయితే ఇంతలోనే ఇండస్ట్రీలో షూటింగ్స్ బంద్ అయ్యాయి. దీంతో ఆగస్టు తొలి వారంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు సెప్టెంబర్ 8వ తారీఖు నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సినిమా యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తొంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావడానికి వారం రోజులు ముందుగానే వరుస పెట్టి మహేష్ త్రివిక్రమ్ చర్చలు జరుపుతూ ఉన్నారట.
ఏది ఏమైనా సెప్టెంబర్ మొదటి వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి ఏకధాటిగా జరుపుకుంటూ ఏప్రిల్ 28వ తారీకు చెప్పిన తేదీకి విడుదల చేయాలని సినిమా యూనిట్ రెడీ అవుతోంది. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. హీరో తరుణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. “అలా వైకుంఠపురంలో” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత… త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.