Devi Sriprasad: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు దేవి శ్రీ ప్రసాద్ చేతినిండా సినిమాలు ఉండేవి. తమన్ ఉన్నాగాని ఎక్కువగా డీఎస్పీకి డైరెక్టర్లు మొగ్గు చూపే వాళ్ళు. దీంతో తమన్ దేవిశ్రీ మధ్య మ్యూజికల్ వార్ నువ్వానేనా అన్నట్టుగా ఉండేది. అయితే అప్పట్లో డిఎస్పి పైచేయి సాధించగా తాజాగా మాత్రం.. తమన్ దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా “అల వైకుంఠపురం లో” సినిమా పాటలతో అనేక రికార్డులు సృష్టించిన తమన్ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ… సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే రికార్డు స్థాయి సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్టార్ సినిమాలు దాదాపు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో డీఎస్పీ బండి చాలా శ్లోగా వెళ్లే పరిస్థితి కనబడుతోంది. ఈ పరిణామంతో దేవి శ్రీ ప్రసాద్ జోరు తగ్గిందని తెగ వార్తలు వస్తున్న క్రమంలో టాలీవుడ్ లో కాకపోయినా ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులు బాగా లైక్ చేస్తున్నారట. ముఖ్యంగా పుష్ప సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి… బాలీవుడ్ బాగా ఫిదా అయిందట.
దీంతో బాలీవుడ్ ప్రముఖ హీరో వరుణ్ ధావన్ తన తదుపరి చిత్రాన్నికి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ కి ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. వాస్తవానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమాకి చాలా మంది.. మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేస్తూ ఉంటారు. అయితే దానికి భిన్నంగా ఓకే సినిమాకి ఆల్బమ్ మొత్తాన్ని దేవి శ్రీ ప్రసాద్ చేతికి వరుణ్ ధావన్ ఇవ్వటం బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇక ఇదే సమయంలో రణవీర్ సింగ్ పూజా హెగ్డే నటించిన సినిమాకి కూడా ఇటీవల దేవిశ్రీప్రసాద్ రెండు పాటలు అందించడం జరిగింది. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గిన దేవిశ్రీప్రసాద్ బాలీవుడ్లో వరుస ఆఫర్లు రావడం.. ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.