Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పుడు సీనియర్ హీరోలుగా మారిపోవడం తెలిసిందే. వయసు మీద పడటంతో చాలావరకు.. తమ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ కొద్దిగా స్పీడ్ తగ్గించారు. ఒకప్పుడు ఈ నలుగురు బాక్సాఫీస్ వద్ద పోటీపడే వాళ్ళు. తర్వాత జనరేషన్ మహేష్, ఎన్టీఆర్, పవన్, ప్రభాస్ మరి కొంతమంది హీరోలు రావటం..జోరు చూపించడంతో వీళ్ళ స్పీడు తగ్గింది. ఇదిలా ఉంటే చాలావరకు ఈ హీరోలు సింగల్ గా కాకుండా మరో యంగ్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తూ చాలా తెలివిగా ప్రస్తుతం కెరియర్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి “వాల్తేరు వీరయ్య” చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటిస్తున్నారు. “అన్నయ్య” సినిమా తర్వాత రవితేజతో చిరంజీవి చాలా కాలం తర్వాత నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా వైజాగ్ బ్యాక్ డ్రాప్ తరహాలో షూట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాలో రవితేజకి సంబంధించిన కీలక సన్నివేశాలు షూట్ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరోస్ విక్టరీ వెంకటేష్ ఇంకా నాగార్జున గెస్ట్ రోల్స్ లో చేయటానికి రెడీ అయినట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. స్టోరీ పరంగా ఈ రెండు పాత్రలు కీలకమైనవి అని.. దీనికి నాగ్, వెంకీ అయితే కరెక్ట్ గా సూట్ అవుతారని డైరెక్టర్ కి చిరంజీవి తెలపడం జరిగినట్లు టాక్. ఇందుకు గాను నాగ్, వెంకీ కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం అనేది తెలియాలంటే సినిమా యూనిట్ అధికారికంగా కన్ఫామ్ చేస్తే బాగుంటుంది. చిరంజీవి సరసన శృతి హసాన్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.