Nayantara: హీరోయిన్ నయనతార దర్శకుడు విగ్నేష్ జంట గురువారం వేదమంత్రాల నడుమ ఒకటైంది.. మహాబలిపురంలోని గార్డెన్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.. వీరి పెళ్లికి అతి తక్కువ మంది కేవలం 200 మంది మాత్రమే హాజరయ్యారు.. కానీ భోజనాలు మాత్రం లక్షల మందికి పెట్టారు.. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.. ఇంతకీ కొత్త జంట ఎవ్వరికీ వివాహ విందు ఏర్పాటు చేశారంటే..!?
తమిళనాడు మొత్తం 18 వేల మంది పిల్లలకు ఒక లక్ష మంది వృద్ధులకు భోజనం అందించారని ఈ జంట ముందుగానే నిర్ణయించుకున్నారట. వారి పెళ్లి రోజున వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాల కు నయనతార విగ్నేష్ మధ్యాహ్న భోజనం అందించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నారట.. ఈ ఏర్పాట్లకు కావాల్సిన అన్ని పనులు ముందుగానే పూర్తి చేశారట. ఈ జంట వారి పెళ్లి సందర్భంగా కేవలం అతి తక్కువ మందిని మాత్రమే పిలిచి.. లక్షల మందికి అన్నదానం చేసిన ఈ జంటను నెటిజన్లు ప్రశంసించకుండా ఉండలేకపోయారు.. మరోవైపు నయనతార, విఘ్నేష్ అభిమానులు కూడా వీరి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
నయనతార విగ్నేష్ జంటను ఆశీర్వదించడానికి బాలీవుడ్ షారుఖ్ ఖాన్ ఆ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇక నయనతారకు విగ్నేష్ ను తాళి కట్టమని ఆ తాళిబొట్టు ను సూపర్ స్టార్ రజనీకాంత్ అందించారని మరో సమాచారం. నయనతార విగ్నేష్ వివాహ వేడుకల ప్రచార హక్కులను నెట్ ఫ్లిక్ 25 కోట్లు కొనుగోలు చేసింది.. దాంతో ఐదు రోజుల ముందు నుంచే ఈ సంస్థ వివాహ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు.